- Home
- Entertainment
- వెంకటేష్ సరికొత్త రికార్డు, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్ల సునామీ.. చిరు, బన్నీ రికార్డులకు ఎసరు!
వెంకటేష్ సరికొత్త రికార్డు, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్ల సునామీ.. చిరు, బన్నీ రికార్డులకు ఎసరు!
వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డులను బ్రేక్ చేయబోతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
విక్టరీ వెంకటేష్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఫామ్లోకి వచ్చారు. ఆయన సోలోగా హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. `దృశ్యం` సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత `ఎఫ్ 2` కూడా విజయం సాధించింది. కానీ ఆ క్రెడిట్ చాలా మంది పంచుకున్నారు. సోలో హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టి దశాబ్దానికిపైగానే అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు `సంక్రాంతికి వస్తున్నాం`సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు వెంకీ. బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్నాడు.
వెంకటేష్ ప్రస్తుతం `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతికి జనవరి 14న విడుదలైంది. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని దూసుకుపోతుంది. మొదటి వారంలో భారీ కలెక్షన్లని సాధించింది. ఇంకా చెప్పాలంటే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
నాన్ పాన్ ఇండియా సినిమాల్లో మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు చేసిందిన చిత్రంగా `సంక్రాంతికి వస్తున్నాం` నిలిచింది. ఈ చిత్రం ఏడు రోజుల్లో ఏకంగా రెండు వందల కోట్ల మార్క్ ని దాటింది. ఫస్ట్ వీక్లోనే ఇది రూ. 203కోట్ల గ్రాస్ని సాధించింది. అంతేకాదు వంద కోట్లకుపైగా షేర్ సాధించింది. వెంకటేష్ కెరీర్లోనే వంద కోట్ల షేర్ సాధించిన చిత్రంగా `సంక్రాంతికి వస్తున్నాం` నిలిచింది.
ఈ మూవీ ఓవర్సీస్లోనూ దుమ్మురేపుతుంది. అమెరికాలోనూ ఈ మూవీ 2.3 మిలియన్ డాలర్లు సాధించడం విశేషం. పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలు కూడా డీలా పడుతున్న నేపథ్యంలో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ యూఎస్లో ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషం.
ఈ లెక్కన వెంకీమామ మున్ముందు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు. ఆయన ఏడు రోజుల్లోనే రెండు వందల కోట్ల గ్రాస్ సాధించారంటే మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాలు లేవు. దీంతో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీకి పండగే పండగా అని చెప్పొచ్చు.
ఆడియెన్స్ నుంచి సోమవారం దక్కిన ఆదరణే కనిపిస్తే అన్ని నాన్ పాన్ ఇండియా రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేయబోతుందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నటించిన `అలా వైకుంఠపురములో` రూ.250 కోట్లు, చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` రూ.240కోట్లతో టాప్లో ఉన్నాయి. చూడబోతుంటే వెంకీ.. అటు బన్నీ, ఇటు చిరు రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఏడు రోజుల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీ `అల వైకుంఠపురములో` రికార్డుని ఈ మూవీ బ్రేక్ చేసింది. ఇక మిగిలింది ఆల్ టైమ్ రికార్డులు మాత్రమే. ఇదే జరిగితే తెలుగు(పాన్ ఇండియా కాకుండా) లాంగ్వేజ్ సినిమాల్లో వెంకీ అత్యధిక వసూళ్లని రాబట్టిన హీరోగా నిలుస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.
వెంకటేష్ కి ఈ సక్సెస్కి కారణం ఆయన బలాన్ని నమ్ముకోవడమే. వెంకీ అంటే ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ మెయిన్గా ఉండాలి. ఇప్పటి వరకు ఆయనకు పెద్ద బ్లాక్ బస్టర్స్ సాధించిన చిత్రాలన్నీ ఈ కోవకు చెందినవే. కానీ అవి కాకుండా యాక్షన్ సినిమాలంటూ వెళ్లారు. బోల్తా పడ్డారు. ఇటీవల కాలంలో చాలా సినిమాలు చేసినా ఈ స్థాయిలో సక్సెస్ కాలేదు.
`ఎఫ్2`, `దృశ్యం` వంటి చిత్రాలు కూడా `సంక్రాంతికి వస్తున్నాం` తర్వాతనే అని చెప్పాలి. వెంకీకి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో నిరూపించారు. ఓ రకంగా ఆయన తన బలం ఏంటో లేట్గా అయినా గుర్తించారు. సక్సెస్ అయ్యారు. ఇదే నమ్ముకుని ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరించే సినిమాలు చేస్తే ఆయన కచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
read more: బాలకృష్ణకి షాకిచ్చిన చిరంజీవి, వెంకటేష్.. నాగార్జున అసలు పోటీలోనే లేరుగా!
also read: స్టార్ కమెడియన్ సంతానంకి ఊహించని ఆస్తులు.. నవ్వించి కోట్లు వసూలు చేస్తున్న హాస్య నటుడు