MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాజీ ప్రధాని ఇల్లు అద్దెకి తీసుకున్న వరుణ్ తేజ్, లావణ్య ..అడుగు పెడితే అదృష్టం గ్యారెంటీ, పవన్ ఏం చేశారంటే

మాజీ ప్రధాని ఇల్లు అద్దెకి తీసుకున్న వరుణ్ తేజ్, లావణ్య ..అడుగు పెడితే అదృష్టం గ్యారెంటీ, పవన్ ఏం చేశారంటే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. నవంబర్ 14న వరుణ్ నటించిన మట్కా చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో 50 ఏళ్ళ మధ్య వయస్కుడిగా నటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 09 2024, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. నవంబర్ 14న వరుణ్ నటించిన మట్కా చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో 50 ఏళ్ళ మధ్య వయస్కుడిగా నటించారు. పాత్రలో అనేక వేరియేషన్స్ ఉంటాయి. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ తన మేకోవర్ మార్చుకుని చాలా కష్టపడ్డారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే వరుణ్ తేజ్ తన పర్సనల్ లైఫ్ లో కూడా కొత్త డెసిషన్ తీసుకున్నారు. మొన్నటివరకు నాగబాబు కుటుంబం మణికొండలో ఉండేవారు. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య ఇతర కుటుంబ సభ్యులంతా జూబ్లీ హిల్స్ కి మారారు. జూబ్లీ హిల్స్ లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకి చెందిన అపార్ట్మెంట్ ఉంది. పివి నరసింహారావు మరణించిన తర్వాత ఆ ఇంటిని ఆయన కుమార్తె టేకోవర్ చేసుకున్నారు. 

35

ఆ అపార్ట్మెంట్ చాలా లక్కీ అంట. ఈ భవనం కట్టిన తర్వాతే పివి ప్రధాని అయినట్లు తెలుస్తోంది. ఆ మధ్యన పివి కుమార్తె ఈ భవనాన్ని మైత్రి మూవీస్ సంస్థకి అద్దెకి ఇచ్చారు. ఈ భవనంలో తమ ఆఫీస్ ప్రారంభించిన తర్వాత మైత్రి సంస్థకి తిరుగులేకుండా పోయింది. పీవీ నరసింహారావు అపార్ట్మెంట్ లో ఆఫీస్ ప్రారంభించిన తర్వాతే ఉప్పెన, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ మైత్రి సంస్థకి దక్కాయట. 

45

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మైత్రి సంస్థ ఈ అపార్ట్మెంట్ ని వదిలేశారు. ఇప్పుడు ఈ భవనాన్ని వరుణ్ తేజ్ అద్దెకి తీసుకున్నారు. దీపావళి సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో వరుణ్ తేజ్, లావణ్య ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారట. మెగా ఫ్యామిలీ దీపావళి సంబరాలు ఈ ఇంట్లోనే జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇంటిని సందర్శించినట్లు వరుణ్ తెలిపారు. 

55

బాబాయ్ కి నా రూమ్, డిజైన్ మొత్తం చూపించాను. సినిమాలు జాగ్రత్తగా చేస్తున్నావా అని కాసేపు మాట్లాడారు. ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లో కలుసుకునట్లు వరుణ్ తేజ్ రివీల్ చేశారు. మరి వరుణ్ తేజ్ కి ఈ ఇల్లు ఎలాంటి అదృష్టం తెచ్చిపెడుతుందో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved