`ఉప్పెన` జోడి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి మరోసారి కలిశారు..ఎక్కడో తెలుసా?
`ఉప్పెన` సినిమాతో సంచలనం క్రియేషన్ చేశారు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. ఓవర్నైట్ స్టార్స్ అయిన ఈ జోడికి యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా వీరిద్దరు మరోసారి కలిశారు. అందుకు `నెం1యారీ` వేదికైంది.
రానా హోస్ట్ గా `ఆహా` ఓటీటీ యాప్లో టాక్ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ షో రన్ అవుతుంది. అనేక మంది తారలు ఇందులో పాల్గొని సందడి చేస్తున్నారు. తాజాగా `ఉప్పెన` జోడి మెరిసింది.
రానా షోలో `ఉప్పెన` జోడి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి మెరిశారు. ఇందులో అనేక విషయాలు పంచుకున్నారు. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
వీరు రానాతో కలిసి ముచ్చటించిన ఎపిసోడ్ ఆదివారం(మే9)న ప్రసారం కానున్నట్టు తెలిపారు. దీంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇందులో వీరు ఏం విషయాలను పంచుకున్నారనేది ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం వీరు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్గా మారాయి.
ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవలే గిరీశయ్య దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభించారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
మరోవైపు కృతి శెట్టి ప్రస్తుతం నానితో `శ్యామ్ సింగరాయ్`, సుధీర్బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్తో ఓ సినిమా చేస్తుంది. ఈ అమ్మకి భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు.