21ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన త్రిషా జీవితాన్ని మార్చివేసింది
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా ఉన్నారు త్రిషా. స్టార్ హీరోయిన్ గా అద్భుతమైన పాత్రలు చేసిన త్రిషా తన జీవితంలోని అరుదైన సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ త్రిషాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్ గా దాదాపు దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలింది త్రిషా. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతగా ఉండేదంటే ఆమె సినిమాలో ఉంటే చాలు హిట్ ఖాయమే అన్నట్లు.
కెరీర్ బిగినింగ్ లో త్రిషా హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్ చేశారు. 1999లో విడుదలైన జోడి మూవీలో త్రిషా హీరోయిన్ సిమ్రాన్ ఫ్రెండ్ గా కనిపించారు. అలా త్రిషా వెండితెర అరంగేట్రం జరిగింది.
ఇక 2003లో త్రిషా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తరుణ్ హీరోగా వచ్చిన నీ మనసు నాకు తెలుసు చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు.
2004లో వచ్చిన వర్షం మూవీ త్రిషాకు భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ హిట్ కొట్టింది. ఆ మూవీలో త్రిషా నటన తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ త్రిషా కెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. అతడు, స్టాలిన్, కృష్ణ వంటి చిత్రాలు త్రిషను స్టార్ హీరోయిన్ చేశాయి.
ఐతే తన కెరీర్ కి నాంది పలికిన ఓ అరుదైన సంఘటన త్రిషా తాజాగా పంచుకుంది. త్రిషా 21ఏళ్ల క్రితం మిస్ చెన్నైగా ఎంపికయ్యారట. సెప్టెంబర్ 30, 1999లో జరిగిన ఆ సంఘటన త్రిషా నటనను కెరీర్ గా ఎంచుకోవడానికి కారణం అయ్యింది.
ప్రస్తుతం త్రిషా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. పొన్నియన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్ట్ తో పాటు త్రిషా చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.