త్రిష పెళ్ళి శింబుతోనే..మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్.. అంతా రహస్యమేనా?
లాక్డౌన్ టైమ్లో వరుసగా సినీ తారలు పెళ్ళిళ్లు చేసుకుని మ్యారేజ్ లైఫ్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు కోలీవుడ్ క్రేజీ కపుల్ శింబు, త్రిష సైతం త్వరలో పెళ్ళి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తుంది.
టాలీవుడ్లో పెళ్లి సందడి కొనసాగుతుంది. లాక్ డౌన్ టైమ్ మ్యారేజ్ ఈవెంట్గా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే రానా, నితిన్, నిఖిల్ మ్యారేజ్ చేసుకోగా, నిహారిక ఎంగేజ్మెంట్అయ్యింది. స్టార్ హీరోయిన్ కాజల్ ఈ నెల 30న మ్యారేజ్ చేసుకోబోతుంది. తాజాగా త్రిష కూడా పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.
శింబు, త్రిషలు ప్రేమలో ఉన్నట్టు చాలా కాలం క్రితం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు అప్పట్లో కలిసి తిరిగారు కూడా. ఆ టైమ్లో మ్యారేజ్ కి సిద్ధమయ్యారని, కొన్ని కారణాలతో ఆగిపోయారని వార్తలొచ్చాయి.
మధ్యలో శింబు.. నయనతారతో ప్రేమాయం సాగించి ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అయితే ఇటీవల మళ్ళీ త్రిష, శింబు కలిసి మాట్లాడుకుంటున్నారని, తిరిగి తమ లవ్ని ట్రాక్ ఎక్కించారనే టాక్ వినిపిస్తుంది.
శింబు, త్రిష కలిసి `అలై`, `ఏం మాయ చేసావె` తమిళ వెర్షన్లో కలిసి నటించారు. `ఏం మాయ చేసావె` తమిళ సినిమా షూటింగ్ టైమ్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో అనేక రోజులు కలిసి డేటింగ్ చేశారు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అప్పట్లో వీరి లవ్ స్టోరీ చర్చనీయాంశంగానూ మారింది.
అయితే మధ్యలో త్రిష ఓ వ్యాపారవేత్త వరుణ్ మణియన్తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆయనతో కలిసి టూర్లు ఎంజాయ్ చేసింది. ఏమైందో ఏమో అది ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది.
ఇక ఇప్పుడు అంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాను కూడా చేసుకోవాలని త్రిష డిసైడ్ అయ్యింది. అందుకు శింబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తెలుగులో `ఏం మాయ చేసావె`లో నటించిన నాగచైతన్య, సమంత రియల్ లైఫ్లో ఒక్కటయ్యారు. ఇప్పుడు శింబు-త్రిష లవ్ స్టోరీపై ఆసక్తి నెలకొంది.
మ్యారేజ్ ప్లాన్ చాలా సీక్రెట్గా సాగుతుందని, అన్ని కుదిరితే, అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్లో పెళ్ళిపీటలెక్కేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శింబు, త్రిషల మ్యారేజ్కి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది.
వీరి రహస్య పెళ్లి వార్తపై ఇటీవల శింబు తండ్రి టీ.రాజేందర్ని ప్రశ్నించగా, ఆయన దాటవేశారు. దీనిపై స్పందించలేదు. దీంతో ఈ వార్త నిజమనే రూమర్లకి మరింత బలం చేకూరినట్టయ్యింది.
శింబు ప్రస్తుతం `మానాడు`లో హీరోగా నటిస్తున్నాడు. `మహా` చిత్రంలో గెస్ట్ గా నటిస్తున్నాడు. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తున్న త్రిష వరుసగా సినిమాలు చేస్తూ క్షణం తీరక లేకుండా గడుపుతోంది.
ప్రస్తుతం త్రిష చేతిలో `పరమపథమ్ విలయట్టు`, `గర్జనై`, `రాంగి`, `షుగర్`, `రామ్`, `పొన్నియిన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.