- Home
- Entertainment
- అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు.. అజిత్ని బీట్ చేయలేకపోయిన సూపర్ స్టార్
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు.. అజిత్ని బీట్ చేయలేకపోయిన సూపర్ స్టార్
2025 సంవత్సరంలో కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాల జాబితా విడుదలైంది. ఆ జాబితాలో ఏ సినిమాలు ఉన్నాయో చూద్దాం.

అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 మూవీస్
కోలీవుడ్కి వెయ్యి కోట్లు అనేది ఒక కలగానే మిగిలిపోయింది. రజనీకాంత్ `కూలీ` మూవీ దాన్ని బీట్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఇది ఐదు వందల కోట్ల వద్దనే ఆగిపోయింది. అయితే ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలు ఉంది. ఈ లోపు ఏదైనా మూవీ మ్యాజిక్ చేస్తుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నారు కోలీవుడ్ సినీ లవర్స్. ఈ క్రమంలో ఈ ఏడాది (2025) కోలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
5. తలైవన్ తలైవి(సార్ మేడమ్)
పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా `తలైవన్ తలైవి`(సార్ మేడమ్). సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీ జూలై నెలలో విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతికి జంటగా నిత్య మీనన్ నటించింది. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తమిళనాడులో రూ.64.75 కోట్లు వసూలు చేసింది. ఐదవ స్థానంలో నిలిచింది.
4. డ్రాగన్
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా `డ్రాగన్`. ఏజీఎస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి నెలలో విడుదలైంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, హర్షద్ ఖాన్, విజే సిద్ధు, మిష్కిన్ వంటి పెద్ద తారాగణం నటించింది. ఈ సినిమా తమిళనాడులో రూ.83 కోట్లు వసూలు చేసి నాల్గవ స్థానంలో ఉంది.
3. విడముయార్చి
హీరో అజిత్ కుమార్ నటించిన `విడముయార్చి` సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలైంది. ఈ సినిమాకి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. లైకా నిర్మాణంలో విడుదలైన ఈ సినిమాలో త్రిష, ఆరవ్, అర్జున్, రెజీనా వంటి వారు నటించారు. తమిళనాడులో రూ.83 కోట్లు వసూలు చేసి అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల జాబితాలో 3వ స్థానంలో ఉంది.
2. కూలీ
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కూలీ` సినిమా ఆగస్టు నెలలో విడుదలైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ వంటి పెద్ద తారాగణం నటించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా తమిళనాడులో రూ.148.8 కోట్లు వసూలు చేసి రెండవ స్థానంలో ఉంది.
1. గుడ్ బ్యాడ్ అగ్లీ
ఈ జాబితాలో మొదటి స్థానంలో అజిత్ కుమార్ నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా ఉంది. ఈ సినిమాకి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, అర్జున్ దాస్, సిమ్రాన్, సునీల్ వంటి వారు నటించారు. ఈ సినిమా తమిళనాడులో రూ.152.65 కోట్లు వసూలు చేసింది.