MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్, బాలయ్య, వెంకీ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం కళ్లు చెదిరే గిఫ్ట్..టికెట్ ధరలు ఎంతెంత పెంచారో తెలుసా

రాంచరణ్, బాలయ్య, వెంకీ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం కళ్లు చెదిరే గిఫ్ట్..టికెట్ ధరలు ఎంతెంత పెంచారో తెలుసా

పుష్ప 2 లాంటి భారీ హిట్ తో 2024ని టాలీవుడ్ ఘనంగా ముగించింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి చిత్రాలు ముస్తాబవుతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

2 Min read
Tirumala Dornala
Published : Jan 01 2025, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పుష్ప 2 లాంటి భారీ హిట్ తో 2024ని టాలీవుడ్ ఘనంగా ముగించింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి చిత్రాలు ముస్తాబవుతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రమోషన్స్ తో ఆయా చిత్రాలు దూసుకుపోతున్నాయి. గట్టి పోటీ తప్పదు అన్నట్లుగా మూడు చిత్రాల జోరు కనిపిస్తోంది. అయితే రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. 

25

ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. కానీ ఏపీలో మాత్రం సమస్య లేదు. ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి చిత్రాలకు ఊహించని గిఫ్ట్ సిద్ధం చేసింది. భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించింది. 

 

35

తాజా సమాచారం మేరకు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు పెంచిన టికెట్ ధరలు ఫిక్స్ అయ్యాయట. ఏ చిత్రానికి ఎంత మేరకు టికెట్ ధరల్ని ఏపీ ప్రభుత్వం పెంచిందో ఇప్పుడు చూద్దాం.. గేమ్ ఛేంజర్ భారీ అంచనాలతో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లుగానే అత్యధికంగా టికెట్ ధరలు పెంచుకునే వీలు కల్పించారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి సింగిల్ స్క్రీన్స్ లో రూ.135 రూపాయలు, మల్టిఫ్లెక్స్ లలో రూ.175 రూపాయలు అదనంగా పెంచుకునే వీలు కల్పించింది. 

Also Read : అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న అల్లు రామలింగయ్య, చిరంజీవి ఉన్నా ఆ పని చేయడానికి నో చెప్పిన అల్లు అరవింద్

45

అదే విధంగా 1 గంట బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలకు 600 అదనంగా టికెట్ ధరలు పెంచుకోవచ్చు. డాకు మహారాజ్ చిత్రం విషయానికి వస్తే.. 110 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ లో, 135 రూపాయలు మల్టిఫ్లెక్స్ లలో పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోలకు 500 వరకు పెంచుకోవచ్చు. 

55

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి 75 రూపాయలు, 100 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. ఈ చిత్రానికి బెనిఫిట్ షోల అవసరం ఉండదు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఈ మూడు చిత్రాలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడం జరగదు కాబట్టి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved