భయపడకుండా కాశ్మీర్ లో అడుగుపెడితే బంపర్ హిట్టే!
80, 90 దశకాల వరకు తెలుగు సినిమాని ఫారెన్ లో షూట్ చేసే అలవాటు లేదు. అప్పటి దర్శక నిర్మాతలకు సాంగ్స్ షూట్ చేయడానికి ఊటీ, కశ్మీర్ లాంటి ప్రాంతాలే కనిపించేవి. 1995 తర్వాత కశ్మీర్ లో సినిమాలు షూట్ చేయడం బాగా తగ్గింది. కశ్మీర్ అందాలలో చిత్రీకరణ జరుపుకున్న అప్పటి తెలుగు చిత్రాలు ఇవే!
అల్లావుద్దీన్ అద్భుత దీపం: కశ్మీర్ లో తొలిసారి షూటింగ్ జరుపుకున్న తెలుగుసినిమా ఘనత ఏఎన్నార్ కే దక్కుతుంది. 1957లో తెరకెక్కిన అల్లావుద్దీన్ అద్భుత దీపం చిత్రాన్ని కశ్మీర్ లో కొంత భాగం చిత్రీకరించారు.
శ్రీవారి ముచ్చట్లు: అల్లావుద్దీన్ అద్భుత దీపం తర్వాత మరికొన్ని ఏఎన్నార్ చిత్రాలు కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. వాటిలో ప్రధానమైనది శ్రీవారి ముచ్చట్లు చిత్రం. ఈ చిత్రంలో ఏఎన్నార్ సరసన జయప్రద, జయసుధ నటించారు.
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు : ఎన్టీఆర్ చిత్రాలు కూడా ఎక్కువగా కశ్మీర్ లో షూటింగ్ జరుపుకునేవి. బాలయ్య, ఎన్టీఆర్ కలసి నటించిన రౌడీ రాముడు కొంటె కృష్ణుడు చిత్రాన్ని కశ్మీర్ అందాలలో చిత్రీకరించారు.
చీకటి వెలుగులు : కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకున్న సూపర్ స్టార్ కృష్ణ చిత్రాల్లో చీకటి వెలుగులు ముఖ్యమైనది. ఈ చిత్రంలో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించారు.
పసివాడి ప్రాణం : చిరంజీవి, కశ్మీర్ పేరు వినగానే 'కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో' అనే సూపర్ హిట్ సాంగ్ గుర్తుకొస్తుంది. ఈ పాట పసివాడి ప్రాణంలోనిది. కాశ్మీర్ అందాలలో ఈ సాంగ్ ని చిత్రికరించారు.
రాక్షసుడు : చిరంజీవి చిత్రాలు కూడా చాలా వరకు కశ్మీర్ లోనే చిత్రీకరణ జరుపుకున్నాయి. రాక్షసుడు చిత్రంలోని పాటలని కూడా కశ్మీర్ లో చిత్రీకరించారు.
భలే దొంగ : బాలయ్య, విజయశాంతి నటించిన భలే దొంగ చిత్రాన్ని కొంతభాగం కశ్మీర్ లో చిత్రీకరించారు.
స్వర్ణకమలం: విక్టరీ వెంకటేష్, కళాతపస్వి కె విశ్వనాధ్ కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ స్వర్ణ కమలం కూడా కొంత భాగం కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంది.
వెంకీ మామ : ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 95 తర్వాత తెలుగు చిత్రాల తాకిడి కశ్మీర్ లో బాగా తగ్గింది. దర్శకనిర్మాతలెవరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేదు. చాలా రోజుల తర్వాత కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి తెలుగు స్టార్ హీరో చిత్రం వెంకీ మామ. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా కశ్మీర్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2020 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.