- Home
- Entertainment
- Gautham Raju : ఫిల్మ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఫ్యామిలీ డిటేయిల్స్.. సినీ ప్రస్థానం..
Gautham Raju : ఫిల్మ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఫ్యామిలీ డిటేయిల్స్.. సినీ ప్రస్థానం..
టాలీవుడ్ ఫిల్మ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (Gautham Raju) లేరనే చేధు నిజాన్ని సినీ లోకం జీర్ణించుకోలేకపోతోంది. అయితే ఈయన ఎక్కడ పుట్టారు. తల్లిదండ్రులు, తోబుట్టువుల వివరాలు, సినీ ప్రస్థానం గురించి ఒకసారి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ ఫిల్మ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు నిన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సినిమాలకే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్, మాలీవుడ్ చిత్రాలకు కూడా ఈయన పని చేయడం విశేషం. సాంకేతికంగా వందల చిత్రాలను పనిచేసిన అనుభవం ఆయనది.
అయితే ఈయన వర్క్ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈయన ఎక్కడ జన్మించారు. ఆయన తల్లిదండ్రుల వివరాలు.. తోబుట్టుల వివరాలు చాలా కొద్ది మందికే తెలుసు. అలాగే ఆయన సిని రంగంలోకి అడుగులు వేసిన తీరు కూడా చాలా ఆసక్తి కరంగా ఉంది. ఒకసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
సినిమానే సర్వస్వంగా జీవించిన అతికొద్ది మందిలో టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (Gautham Raju) పేరు కూడా వినిపిస్తుంది. ఈయన 1954 జనవరి 15న తెలుగు నేలపైనే జన్మించారు. జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు. అయినప్పటికీ గౌతమ్ రాజు పెరిగింది.. విద్యాభ్యాసం కొనసాగించింది మాత్రం తమిళనాడులోని మద్రాసు పట్టణంలోనే.
పతి రంగయ్య - కోదనాయకి దంపతులకు గౌతమ్ రాజు పుట్టారు. తండ్రి రంగయ్య ‘బీ అండ్ సీ’అనే మిల్స్ లో పనిచేస్తుండేవాడు. ఈయనకు ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లెలు కూడా ఉంది. వీరంతా ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. గౌతమ్ రాజు మాత్రం తన చదువును ‘బీఏ’ వరకు పూర్తి చేసి సినిమాలపై ఇష్టంతో రంగ ప్రవేశం చేశాడు.
తొలుత 1974లో అరుణాచలం స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్ లో గౌతమ్ రాజు ఆపరేటర్ (అప్రెంటిస్’గా జాయిన్ అయ్యాడు. ఏడాది పాటు అక్కడే పనిచేసిన ఆయన తర్వాత తమిళ నటుడు రాజేంద్రకు చెందిన ‘రాజేంద్ర టూరింగ్ టాకీస్’లో ఆపరేట్ గా చేరి లైసెన్స్ పొందాడు. దాని ద్వారా అప్పటి ఎడిటర్ దండపాణి వద్ద అసిస్టెంట్ గా చేరాడు. కొన్ని మెళకువలు నేర్చుకున్నాయన లో-బడ్జెట్ లో వచ్చే మళయాళ, ఒరియా సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేశాడు. ఈ సమయంలో ఆయనకు నెలకు రూ.150 వరకు సంపాదించేవాడు.
ఆ తర్వాత దండపాణి రెకమండేషన్ తో మరో ప్రముఖ ఎడిటర్ సంజీవి వద్ద అసిస్టెంట్ గా చేరాడు. ఈ దశ గౌతమ్ రాజు జీవితంలో పెద్ద మలుపు లాంటింది. అసిస్టెంట్ గానే ఏడాదిలో 30కి పైగా సినిమాలకు పనిచేసి మంచి ప్రతిభను సాధించాడు. దాంతో తమిళ స్టార్ విజయ్ (Vijay) తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తొలి దర్శకత్వంలో ‘అవల్ ఓరు పచ్చికొళందై’కి ఫస్ట్ టైం ఎడిటర్ గా వర్క్ చేసి గుర్తింపు పొందాడు.
ఆ చిత్రం మంచి గుర్తింపు పొందడంతో వరుస ఆఫర్లు అందుకున్నాడు. తెలుగులో ఏఎస్కే చంద్రశేఖర్ - చిరంజీవి కాంబినేషన్ లో తెలుగు, తమిళంలో వచ్చిన చిత్రం ‘చట్టానికి కళ్లు లేవు’కు ఎడిటర్ గా వర్క్ చేశాడు. అప్పటి నుంచి టాలీవుడ్ లోనే వరుస చిత్రాలను పనిచేస్తూ.. మంచి ఎటిటర్ గా గుర్తింపుపొందాడు. ఇప్పటి వరకు 800కు పైగా సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా వర్క్ చేశాడు.
గౌతమ్ రాజు ఇటీవల తెలుగులో వర్క్ చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా.. ‘రేసుగుర్రం, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150’ చెప్పవచ్చు. దర్శకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడం గౌతమ్ రాజు ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈయన ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడంటే.. దర్శక నిర్మాతలు భరోసాగా ఫీలవయ్యేవారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ చిత్రానికి గౌతమ్ రాజు ఎడిటర్ గా నంది అవార్డును అందుకున్నారు.