21 కోట్ల విలువైన ఇంటిని వదిలేసి అత్తతో ఉంటున్న ఐశ్వర్య...ఆ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు...!
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్నారు. అత్యంత వైభంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరుకావడం జరిగింది. భర్త అభిషేక్ బచ్చన్ తో ఆనందంగా గడపడానికి ఐశ్వర్య రాయ్ రూ. 21 కోట్లు ఖర్చుతో అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ బాంద్రాలో కొన్నారు.
ఎంతో ఆశపడి కొన్న లగ్జరీ అపార్టుమెంట్ లో ఐశ్వర్య - అభిషేక్ కాపురం పెట్టలేదు. మామ,అత్తలతోనే ఆమె కలిసి ఉండడం జరిగింది. దానికి కారణం ఏమిటనేది బాలీవుడ్ లో మిలియన్ డాలర్ ప్రశ్నలా మారింది.
అభిషేక్ మరియు ఐశ్వర్య తాము లగ్జరీ అపార్ట్మెంట్ లో కాకుండా అమితాబ్, జయాబచ్చన్ లతో కలిసి ఉండడానికి గల కారణాలు తెలిపారు.
అభిషేక్-ఐశ్వర్య ఎంతో ఇష్టపడి కొన్న అలీషా బంగ్లాలో కాపురం పెట్టపోవడానికి కారణం...పేరెంట్స్ తో కలిసి ఉండాలనే ఆలోచనతోనే అట.
ఓ సంధర్భంలో ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ...'నా తల్లిదండ్రులు బాల్యం నుండే కుటుంబం యొక్క గొప్ప తనం గురించి చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వలన ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరికొకరు దగ్గరగా ఉండడం వలన బంధాలు బలపడతాయి' అన్నారు.
ముంబై లో సన్ టెక్ రియాలిటీ లో ఉన్న ఐశ్వర్య ఇల్లు అత్యంత అధునాతన, విలాసవంతమైన సౌకర్యాలు కలిగి ఉంది. విశాలమైన ఫ్లాట్ లోపల ఓ అందమైన స్విమ్మింగ్ పూల్ ఉంది.
ఈ లగ్జరీయస్ ప్లాట్ లో ఉన్న బెడ్ రూమ్ అద్భుతమైన సిటీ వ్యూ కలిగి ఉంటుంది.
ఈ ప్లాట్ కలిగి ఉన్న ఇంటీరియర్ డిజైన్, కిచెన్ నిర్మాణం చూస్తే మతిపోవాల్సిందే.
కళ్ళు తిప్పుకోలేని డైనింగ్ హాల్, ఫర్నిచర్ వంటి అనేక ప్రత్యేకతలు ఈ ప్లాట్ కలిగి ఉంది.