బీబీసీ రిపోర్టర్తో స్టార్ హీరో లవ్ స్టోరీ
స్టార్ హీరోగా దర్శకుడిగా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకున్న యువ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. హీరోగా మంచి ఫాంలో ఉండగానే పృథ్వీ బీబీసీ ముంబై రిపోర్టర్ సుప్రియా మీనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ కథ మలయాళ ఇండస్ట్రీలో ఓ రేంజ్లో పాపులర్ అయ్యింది.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ 2011 ఏప్రిల్ 25న సుప్రియా మీనన్ను పెళ్లి చేసుకున్నాడు. పాలక్కడ్లో అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి తంతు జరిగింది. వీరిద్దరి కూతురు అలంక్రిత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్ తన ప్రేమకథను వివరించాడు.
ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. `సుప్రియ మలయాళీ అయినా ఎక్కువకాలం ముంబైలోనే ఉంది. అందుకే ఆమె ముంబై అమ్మాయే. నాకు ముంబైని పరిచయం చేసింది సుప్రియనే. నాకు అంతకు ముందుకు ముంబై తెలిసినా.. సుప్రియా పరిచయం అయిన తరువాత ముంబై కొత్తగా కనిపించింది.`
`శాంతారామ్ నావెల్ చదివినపుడు ముంబైలోని హాజి అలీ, లిపోల్డ్ కేఫ్ లాంటి ప్లేసెస్ చూడాలనుకున్నా. అప్పటికే సుప్రియ నాకు పరిచయం, తనను ఆ ప్లేసెస్కు తీసుకెళ్లమని అడిగా. ముంబైలో ఉన్న ఆ కొద్ది రోజులు సుప్రియ నాకు చాలా సాయం చేసింది.`
`ఆ సమయంలోనే మేం ప్రేమలో పడ్డాం. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ముంబైతో మాకు ఓ రొమాంటిక్ కనెక్షన్ ఉంది. అందుకే నా జీవితంలో ఎన్నో ప్రేమానుభూతులను నింపిన ముంబైలో ఉండటం నాకు చాలా ఇష్టం.`
సుప్రియ మీద ప్రేమతో పాటు ఎంతో గౌరవభావం కూడా చూపిస్తాడు పృథ్వీరాజ్. తన కోసం తన ఉద్యోగాన్ని, పెరిగిన ఊరుని సుప్రియ వదుకొని కేరళ వచ్చేసినందుకు ఆమె పట్ల మరింత ప్రేమ, గౌరవం పెరిగాయని చెబుతాడు.