ఎన్నారైలను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే.. ఏఏ దేశాల్లో స్థిరపడ్డారంటే?
టాలీవుడ్ హీరోయిన్లుగా తమదైన ముద్ర వేసుకున్న నటీమణులు.. తమ పెళ్లి విషయంలోనూ భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎలాంటి ప్రాంతీయ బేధం లేకుండా ఎన్నారైలను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. ఇంతకు ఆ హీరోయిన్లు ఎవరు? ఎక్కడెక్కడ స్థిరపడ్డారనేది తెలుసుకుందాం.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగులో తెరకెక్కిన, తెరకెక్కబోతున్న చిత్రాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. మరోవైపు హీరోయిన్లకు కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించి.. తమదైన ముద్ర వేసుకున్న నటీమణులు ఉన్నారు. వీరిలో ఎన్నారైలను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మలెవరు? ఇంతకీ ఏఏ దేశాల్లో స్థిరపడ్డారో చూద్దాం.
బాలానటిగా వెండితెరపై అడుగుపెట్టి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది తెలుగు హీరోయిన్ లయ (Laya). ఫ్యామిలీ హీరోయిన్ గా తెలుగులో చక్కటి సినిమాలతో అలరించింది. అయితే విజయవాడలోని బ్రహ్మణ కుటుంబానికి చెందిన లయ పెళ్లి మాత్రం ఎన్నారైనే చేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని 2006లో మ్యారేజ్ చేసుకుంది. పాప, బాబుకు జన్మిచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీని చూసుకుంటూ అమెరికాలోనే స్థిరపడింది.
అచ్చమైన తెలుగమ్మాయి, అలనాటి హీరోయిన్ మాధవి (Madhavi) కూడా విదేశీ అబ్బాయినే పెళ్లి చేసుకుంది. భారత - జర్మనీ సంతతికి చెందిన రాల్ఫ్ శర్మ అనే వ్యాపారిని 1996లో పెళ్లి చేసుకుంది. న్యూ జెర్సీలో స్థిరపడింది. ముగ్గురు పిల్లలు, భర్తతో హాయిగా గడుపుతోంది. కమల్ హాసన్ ‘మరోచరిత్ర’తో హీరోయిన్ గా మాధవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ నటించి అభిమానులను సొంతం చేసుకుంది.
స్టార్ హీరోయిన్ రంభ (Rambha) 2010లో విదేశీ అబ్బాయితో పెళ్లి పీటలు ఎక్కింది. కెనడాకు చెందిన ఇంద్రకుమార్ తో మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టి అక్కడే స్థిరపడింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సౌత్ లోని అన్ని భాషల చిత్రాల్లో నటించింది.
కేరళలకు చెందిన హీరోయిన్ గోపిక (Gopika) కూడా టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. రవితేజ సరసన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’లో నటించి తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది. ఈ బ్యూటీ అసలు పేరు గర్లీ ఆంటో. స్క్రీన్ నేమ్ మాత్రమే గోపిక. అయితే ఈముద్దుగుమ్మ కూడా ఎన్నారై అజిలేష్ చాకోనిని 2008లోనే పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
మలయాళ సోయగం మీరా జాస్మిన్ (Meera Jasmine) కూడా విదేశీ అబ్బాయినే పెళ్లి చేసుకుంది. 2014లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ అనే ఇంజినీర్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది. ‘అమ్మాయి బాగుంది’ ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెంకోడి’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు వారికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం సెకండ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించింది.