పుట్టి పది రోజులే.. వాణీ జయరాం సింగర్ అవుతుందని అప్పుడే జాతకం చెప్పిన జ్యోతిష్యుడు
లెజెండరీ నేపథ్య గాయనీ వాణి జయరాం సింగర్ అవుతుందని ముందే తెలుసా? జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైందా? వాణి అసలు పేరేంటి? ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
వాణి జయరాం ఇప్పుడు ఎంత గొప్ప గాయని నో అందరికి తెలిసిందే. ఆమె పదికిపైగా భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు ఆలపించారు. ఓ నదిలా ఆమె పాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అయితే ఆమె గాయని అవుతుందని చిన్నప్పుడే జ్యోతిష్యుడు చెప్పాడట. కేవలం పది రోజుల చిన్నారిని చూసి ఆయన ప్రెడిక్ట్ చేశాడట. అదే నిజమవ్వడం విశేషం.
వాణి జయరాం తన తల్లిదండ్రులకు ఐదవ సంతానం. తాను పట్టి పది రోజులే అవుతుందట. ఆ సమయంలో తన తల్లికి జ్వరం వచ్చిందట. ఇంకా తనకు నామకరణం చేయలేదు. ఏం పేరుపెట్టాలనేదానిపై తండ్రి తన పుట్టిన డేట్, టైమ్ తీసుకుని వెల్లూరులోని ఓ ఆస్ట్రోలజర్కి వద్దకి వెళ్లాడట. తన ఫాదర్ చెప్పిన డిటెయిల్స్ ని బట్టి ఆయన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడట.
తన జాతకం చూసి, ఈ బేబీ పెద్దయ్యాక పెద్ద సింగర్ అవుతుందని చెప్పాడట. అయితే అది విని తన ఫాదర్ నవ్వుకున్నాడట. అంతేకాదు తనకు `కలైవాణి` అనే పేరు కూడా పెట్టమన్నాడట. ఈ విషయం విని తన అమ్మకూడా నవ్వుకుందని, కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు తనకు కలైవాణి అనే పేరు నామకరణం చేశారట. అప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటే నిజమవ్వడం ఆశ్చర్యంగా ఉంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరిగిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది వాణి జయరాం.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్పూరి, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ ఇలా పదిహేనుకుపైగా భాషల్లో ఇరవై వేలకుపైగా పాటలు పాడిన వాణి జయరాం తెలుగులో మాత్రం `అభిమానవంతులు` అనే చిత్రంతో గాయనిగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో `ఎప్పటి వలె కాదురా నా సామి` అనే పాట పాడినట్టు చెప్పింది. ఈ సినిమాకి ఎస్పీ కోదండపాణి సంగీతం అందించగా, డా సినారే రాశారు, శోభానాయుడు డాన్సు చేయడం విశేషం.
ఇక దాదాపు ఐదు దశాబ్దాలుగా గాయనీగా రాణిస్తున్న వాణి జయరాం అద్భుతమైన గాత్రానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చిచేరాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం `పద్మ భూషణ్` పురస్కారాన్ని ప్రకటించగా, ప్లే బ్యాక్ సింగర్గా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. అందులో `శంకరాభరణం`, `స్వాతికిరణం`, తమిళంలో `అపూర్వ రాగంగల్` చిత్రాల్లోని పాటలకు ఉత్తమ గాయనీగా మూడు నేషనల్ అవార్డులు వరించాయి. మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డు, నాలుగు స్టేట్ అవార్డులతోపాటు అనేక ఇతర పురస్కారాలు వరించాయి.