సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులేనా.. క్లారిటీ ఇచ్చిన సోదరి
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే సుశాంత్ మృతిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఆర్ధిక పరిస్థితి విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై సుశాంత్ సోదరి స్పదించింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. సినీ జనాలతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్కు అంజలి ఘటిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ముంబై బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఉరివేసుకొని కనిపించాడు. ఆదివారం ఉదయం టిఫిన్ చేసిన తరువాత సుశాంత్ ఈ దుశ్చర్యకు పాల్డడ్డాడు. అయితే సుశాంత్ గత కొంత కాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
సుశాంత్ చాలా కాలంగా బాంద్రాలో ఉంటున్నాడు. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోకి దాదాపు ఆర్నెల్లుగా ఉంటున్నాడు.ఇది పాలి హిల్ ఏరియాలో కాస్ట్లీ డూప్లెక్స్ హౌస్.
ఈ ఇంటికి సుశాంత్ 4 లక్షల 51 వేల రెంట్ పే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇంట్లో ఉండేందుకు డిసెంబర్ 2022 వరకు అగ్రిమెంట్ చేసుకున్నాడు సుశాంత్. అంతేకాదు అందుకు డిపాజిట్గా 12,90,000 రూపాయలు చెల్లించాడు సుశాంత్.
ఈ ఇంట్లో ఓ ఆర్ట్ డైరెక్టర్తో కలిసి ఉంటున్నాడు సుశాంత్. వారికి సాయంగా నలుగులు పనివారు కూడా ఉంటున్నారు.
ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ సోదరి మాట్లాడుతూ తనకి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు, ఒత్తిడులు లేవని చెప్పింది. పోలీసులు కూడా సుశాంత్ బ్యాంక్ అకౌంట్లను లావాదేవిలను చెక్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఈ షాక్ నుండి తేరుకోలేకపోతున్నారు. కొంతగా కాలంగా సుశాంత్ డిప్రెషన్కు చికిత్స తీసుకుంటున్నాడని తెలియటంతో ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ను విచారిస్తున్నారు పోలీస్ అధికారులు.