సుశాంత్ చివరి సినిమా ఓటీటీలోనే.. రిలీజ్ ఎప్పుడంటే!
ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ కు సంబంధించి రకరకాల వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరో మృతితో షాక్కు గురైన చాలా మంది ఇప్పుడిప్పుడే తేరుకొని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ అయ్యింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో సుశాంత్కు జోడిగా సంజన సంఘీ నటించింది. తాజాగా సంజన తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో సినిమా రిలీజ్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ సందర్భంగా సుశాంత్ వర్క్ చేసిన అనుభవాలను షేర్ చేసుకున్న సంజన ఆ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రకటించింది.
దిల్ బెచారా సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ఫాంపై ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రేమ, నమ్మకం, ఎన్నో మధుర జ్ఞాపకాల సమాహారం అంటూ చెప్పుకొచ్చింది సంజన. చిత్ర దర్శకుడు ముఖేస్ ఛబ్రా మాట్లాడుతూ.. `సుశాంత్ కేవలం నా తొలి చిత్ర దర్శకుడు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డ వ్యక్తి కూడా.
కై పోచే నుంచి దిల్ బెచారా వరకు మేం కలిసి పనిచేశాం. తను నా నెక్ట్స్ సినిమాలో కూడా నటిస్తానని మాట ఇచ్చాడు. ఇద్దర కలిసి ఎన్నో ఆలోచనలు చేశాం. కానీ సుశాంత్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మా మీద సుశాంత్ ఎంతో ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ ఇక మీదట మమ్మల్ని నడిపిస్తుంది` అన్నాడు.
2014లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ సినిమాకు దిల్ బెచారా అఫీషియల్ రీమేక్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అతిథి పాత్రలో నటించాడు. లెజెండరీ మ్యూజీషియన్ ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.