రియల్ హీరోతో బాలయ్య ఢీ .. తండ్రి హీరోయిన్తోనూ పోటీ? రచ్చ రచ్చే !
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు క్రేజీ స్టార్స్ మెరవబోతున్నారు.
`సింహా`, `లెజెండ్` చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఇందులో విభిన్న గెటప్లో బాలకృష్ణ కనిపించబోతున్నారు.
ఇందులో ఇద్దరు క్రేజీ స్టార్స్ ని తీసుకోబోతున్నారు. ఇటీవల లాక్డౌన్ టైమ్లో విశేషమైన సేవా కార్యక్రమాలు చేపట్టి దేశ వ్యాప్తంగా పాపులర్ అవ్వడంతోపాటు, రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ విలన్గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. బాలయ్య నటించిన `ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా` చిత్రంలో సోనూ సూద్ విలన్గా నటించారు.
మరోవైపు సీనియర్ హీరోయిన్ జయప్రదని మరో శక్తివంతమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆమె కూడా గతంలో `మహారథి` చిత్రంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
లాక్డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ని త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.
బాలకృష్ణ అక్టోబర్2 గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా భాదితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్త దాన శిబిరానికి పిలునిచ్చారు హిందుపూర్ శాసన సభ్యులు, అగ్ర కథానాయకుడు, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.
మానవాళి ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి, తోటి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్త దానం మాత్రమే అని, ప్రతి ఒక్కరూ రక్త దానం, ప్లాస్మా దానం చేయాలన్నారు.
ఇటీవల అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు కాలనీకి చెందిన టీడిపి నాయకుడు నర్సింహప్ప అనే వ్యక్తి మృతి చెందారు. వారి కుటుంబానికి రూ.1.5లక్షలు ఆర్ధిక సాయం అందించి అండగా నిలిచారు.
అలాగే పిల్లలను బాగా చదివించుకోవాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. అదే విధంగా స్థానిక టీడిపి నాయకులు ఆ కుటుంబానికి తమ వంతుగా ఆర్ధికసహాయం అందించారు.