- Home
- Entertainment
- కృష్ణంరాజు కొడుకు ఎలా చనిపోయాడు, ఆ తప్పు జరగకుంటే..మొదటి భార్య సీత గురించి శ్యామలదేవి సంచలనం
కృష్ణంరాజు కొడుకు ఎలా చనిపోయాడు, ఆ తప్పు జరగకుంటే..మొదటి భార్య సీత గురించి శ్యామలదేవి సంచలనం
కృష్ణంరాజు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు. మొదటి భార్యని ప్రమాదంలో కోల్పోయారు. అది కృష్ణంరాజుకు పిడుగులాంటి సంఘటన. ఆయన వ్యక్తిగత విషయాలని కృష్ణంరాజు రెండవ సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రెబల్ స్టార్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగిన కృష్ణం రాజు మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. కృష్ణంరాజు సినిమాలు తగ్గించిన తర్వాత తన వారసుడు ప్రభాస్ లో తనని తాను చూసుకుని మురిసిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదగడం తో కృష్ణంరాజు ఎంతో గర్వపడ్డారు. కృష్ణంరాజు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు.
krishnam raju
మొదటి భార్యని ప్రమాదంలో కోల్పోయారు. అది కృష్ణంరాజుకు పిడుగులాంటి సంఘటన. ఆయన వ్యక్తిగత విషయాలని కృష్ణంరాజు రెండవ సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కృష్ణంరాజు శ్యామల దేవిని 1996లో రెండవ వివాహం చేసుకున్నారు. శ్యామల దేవి మాట్లాడుతూ 1995లో రాజుగారి మొదటి భార్య సీత షాపింగ్ కి వెళుతూ యాక్సిడెంట్ జరిగి చనిపోయారు.
సీత రాజుగారి మేనకోడలు అవుతుంది. దశాబ్దాల అనుబంధం వాళ్ళది. సీత గారు మరణించడంతో రాజుగారి జీరించుకోలేదు. కొంతకాలం ఇంట్లో నుంచి బయటకి రాలేదు. రాజుగారికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచన వాళ్ళ నాన్నకే వచ్చింది. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు.. కానీ తన ఆకలి తనకి తెలియదు. మంచి భార్య ఉంటే సమయానికి భోజనం పెడుతుంది కదా అని కృష్ణంరాజు గారి నాన్న ఆలోచించారట.
కృష్ణంరాజుని రెండో పెళ్లి చేసుకోమని అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. దీనితో నేను నిరాహార దీక్ష చేస్తా అని భోజనం మానేసి వాళ్ళ నాన్న కూర్చున్నారు. రాజుగారికి ఒప్పుకోక తప్పలేదు. అమ్మాయి కోసం వెతుకుతున్న సమయంలో నేను వైజాగ్ లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కృష్ణంరాజు గారు బాగా దానాలు సహాయాలు చేస్తారట అనే మంచి అభిప్రాయం నాకు ఉంది.
కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. రెండో పెళ్లి అనేసరికి మా అమ్మకి ఇష్టం లేదు. నేను చేసుకుంటా అని చెప్పా. మా అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పింది. నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పా. దీనితో మా అమ్మ కూడా ఒప్పుకుంది. నన్ను బలవంతంగా ఒప్పించారని కృష్ణంరాజు గారు అనుకున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉందొ లేదో కనుక్కో అని వాళ్ళ కజిన్ ని పంపారు. నేను అప్పుడు చిన్న పిల్లలతో ఆడుకుంటున్నా. నా ఇష్టపూర్వకంగా ఇప్పుకున్నట్లు వాళ్ళకి చెప్పా.
చిన్న పిల్లలతో ఆడుకుంటుంది అని నా గురించి రాజుగారికి చెప్పారు. చిన్నపిల్లలతో ఆడుకుంటోంది అంటే మంచి మనసున్న అమ్మాయి అయి ఉంటుంది అని ఆయన కూడా ఇష్టపడ్డారు. ఆ విధంగా మా పెళ్లి జరిగింది. కృష్ణంరాజు గారికి కొడుకులు లేరు. కానీ మొదటి భార్య సీతా దేవికి కొడుకు పుట్టారు. డెలివరీ టైంలో డాక్టర్ చేసిన తప్పు వల్ల బిడ్డ చనిపోయాడు. డాక్టర్ తప్పు చేయకుంటే రాజు గారికి వారసుడు ఉండేవారు అని శ్యామల దేవి అన్నారు.