బన్నీతో ఐటెమ్ సాంగ్.. ఈ సారి ఘాటు మామూలుగా ఉండదట!
బాలీవుడ్లో కథానాయికలు హీరోయిన్గా నటించమేకాదు, అవకాశం వచ్చినప్పుడు ఐటెమ్ సాంగ్ల్లో నర్తిస్తూ తన అందచందాలను చూపిస్తుంటారు. వంపుసొంపులోని ఘాటైన అందాలను ఆడియెన్స్ కి ఎరగా వేస్తుంటారు. థియేటర్కి రప్పించి వారికి కనువిందు కలిగిస్తుంటారు.
కరీనాకపూర్, కత్రీనా కైఫ్, విద్యా బాలన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి హాట్ హీరోయిన్లు ఇప్పటికే అనేక ఐటెమ్ సాంగ్ల్లో నర్తించి మెస్మరైజ్ చేశారు. ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సైతం ఇప్పటికే రెండు చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో స్టెప్పులేసి ఓ ఊపు ఊపింది.
గతంలో `అగ్లీ` చిత్రంలో `డాన్స్ బసంతి` పాటలో శ్రద్ధా డాన్సులతో మంత్రముగ్ధుల్ని చేసింది. ఆడియెన్స్ ని, ముఖ్యంగా కుర్రకారుని విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు `నవాబ్జాడే` చిత్రంలో కూడా `హై రేటెడ్ గర్బు` పేరుతో ఓ స్పెషల్ సాంగ్లో ఉర్రూతలూగించింది.
ఇక ఇప్పుడు తెలుగులో ఆడియెన్స్ ని ఊపేయడానికి రెడీ అవుతుంది. తెలుగులో ఆమె డాన్స్ కి కేరాఫ్గా నిలిచే అల్లు అర్జున్తో స్టెప్పులేయబోతుందని టాక్. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయట.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నాహీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బేసిక్గా సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్లకు యమ క్రేజ్ ఉంటుంది. వాటిని ఆయన అంతే ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుంటారు. సుకుమార్ రూపొందించిన చివరి చిత్రంలో `రంగస్థలం`లో కూడా `జిగేల్రాణి` ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే.
అదే తరహాలో `పుష్ప`లో కూడా ఓ మాస్ ఐటెమ్ సాంగ్ని పెట్టబోతున్నారు. ఇది మామూలు మాస్ కాదు, ఊరమాస్ హాట్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాట టాలీవుడ్ని షేక్ చేసేలా ఉండాలని సుక్కు ప్లాన్ చేస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ కూడా అందుకు తగ్గట్టే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
అందులో కోసమే ఈ సారి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాని దించబోతున్నట్టు టాక్. మరి ప్రభాస్ హీరోయిన్ ఓకే చెబుతుందా అన్నది చూడాలి. గతేడాది ప్రభాస్ హీరోగా రూపొందిన `సాహో`లో శ్రద్ధా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మిశ్రమ స్పందనని రాబట్టుకుంది.