దీపికా పదుకొనెకి షాక్ ఇచ్చిన సాహో బ్యూటీ శ్రద్ధా.. ప్రియాంక సేఫ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకి యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్ షాక్ ఇచ్చింది. ఆ విషయంలో దీపికాని దాటేసి తన ఫాలోయింగ్ ఏంటో చూపించింది. సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
బాలీవుడ్ హీరోయిన్ల మధ్య పోటీ సర్వసాధారణమే. అయితే అది సోషల్ మీడియాకి కూడా పాకింది. సోషల్ మీడియా అకౌంట్లలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే వారు టాప్ అని అర్థంగా భావిస్తుంటారు. అయితే ఇందులో దీపికాని మించిపోయింది శ్రద్ధా కపూర్.
56.5మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకుని ఇండియాలో టాప్లో ఉన్న సెలబ్రిటీల్లో మూడు స్థానానికి చేరుకుంది. గత ఏడాది నుంచి శ్రద్ధా భారీగా తన ఫాలోయింగ్ని పెంచుకుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ, తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పెడుతూ అభిమానులకు, నెటిజన్లకు దగ్గరవుతుంది. ఈ నేపథ్యంలో భారీ ఫాలోయింగ్ని పెంచుకుంది.
ఇక గతంలో భారీ ఫాలోయింగ్తో మూడో స్థానంలో ఉన్న స్టార్ హీరోయిన్ తనని శ్రద్ధా దాటేయడంతో దీపికా పదుకొనె షాక్కి గురవుతుంది. శ్రద్ధా దూకుడు ముందు తాను వెనకబడిపోయింది.
52.3 మిలియన్స్ ఫాలోవర్స్ తో దీపికా నాలుగో స్థానానికి పరిమితమయ్యింది. ఇటీవల దీపిక డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. శ్రద్ధాపై కూడా ఆరోపణలు రావడంతో విచారణ కూడా ఫేస్ చేశారు.
ఇక ఇండియన్ సెలబ్రిటీల్లో 82.4మిలియన్ ఫాలోవర్స్ తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఉంది.
ఆమె 58.2 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలను దాదాపు వదిలేసినట్టే అని టాక్ వినిపిస్తుంది.