ఆ ఆలోచన లేదు.. రీఎంట్రీపై హాట్ బ్యూటీ సమీరా రెడ్డి స్పందన
`నరసింహుడు`, `జై చిరంజీవి`, `అశోక్` చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యారేజ్ చేసుకుని సినిమాలకు దూరమైన సమీరా రెడ్డి త్వరలో తమిళ సినిమా ద్వారా తిరిగి నటించబోతుందని వార్తలొచ్చాయి. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాలో సమీరా నటించబోతుందని తెలుస్తుంది.
అయితే తన రీఎంట్రీపై వచ్చిన వార్తలకు సమీరా రెడ్డి స్పందించింది. `నేను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ వస్తోన్న వార్తలు అవాస్తవాలు. ప్రస్తుతం నేను ఫ్యామిలీ లైఫ్ని ఆస్వాదిస్తున్నా. సినిమాల్లో నటించాలనే ఆలోచనే లేదు` అని పేర్కొంది.
బాంబేకి చెందిన సమీరా రెడ్డి మైక్రోబయాలజీలో గ్రాడ్యూయేట్ చేసింది. ఆ తర్వాత వీడియో జాకీగా కెరీర్ని ప్రారంభించింది. మోడల్గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఆ తర్వాత 2000లో తమిళ సినిమా `సిటిజెన్`కి సైన్ చేసింది. ఈ సినిమా వర్కౌట్ కాలేదు. దీంతో మొదటి ప్రయత్నమే సమీరాని పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈ సారి హిందీలో తన లక్ని పరీక్షించుకుంది.
2002లో హిందీ సినిమా `మైన్ దిల్ తుజ్కే దియా`తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. నటిగా సమీరా రెడ్డిని మంచి పేరు దక్కింది. `దర్నా మన హై`, `ప్లాన్`, `ముసాఫిర్` వంటి చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది.
ఈ క్రమంలో ఈ అమ్మడిపై తెలుగు మేకర్స్ మనసు పడ్డారు. తెలుగులో ఎన్టీఆర్ సరసన `నరసింహుడు` చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇందులో హాట్ అందాలతో అలరించింది. ఆ తర్వాత చిరంజీవి సరసన `జై చిరంజీవి`లో మెరిసింది. ఇందులోనూ సెక్సీగా మత్తెక్కించింది. మరోసారి ఎన్టీఆర్తో `అశోక్`లో మెరిసింది. ఈ సినిమాలు సక్సెస్ కాలేకపోవడంతో సమీరా రెడ్డికి అవకాశాలు తగ్గాయి. దీంతో పూర్తిగా బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత తమిళంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2014లో అక్షల్ వర్దే అని వ్యాపారవేత్తని పెళ్ళి చేసుకుంది. దీంతో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఇక సమీరా రెడ్డి చివరగా కన్నడలో `వరధనాయక` చిత్రంలో మెరిసింది. ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సమీరా స్పందించి ఆ ఉద్దేశం లేదని తెలిపింది.