- Home
- Entertainment
- న్యూయార్క్ లో ఫుల్ ఎంజాయ్ మూడ్ లో సమంత, ఫొటోస్ వైరల్.. జిమ్ లో మిస్టరీ మ్యాన్ ఎవరు..
న్యూయార్క్ లో ఫుల్ ఎంజాయ్ మూడ్ లో సమంత, ఫొటోస్ వైరల్.. జిమ్ లో మిస్టరీ మ్యాన్ ఎవరు..
సమంతని మయోసైటిస్ వ్యాధి ఏడాది నుంచి వేధిస్తోంది. ఆ మధ్యన యుఎస్ లో సమంత చికిత్స తీసుకుంది. అయితే పూర్తిగా వ్యాధి నయం కాలేదు.

ఏడాది కాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
మంచి బజ్ సొంతం చేసుకున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇదిలా ఉండగా సమంతని మయోసైటిస్ వ్యాధి ఏడాది నుంచి వేధిస్తోంది. ఆ మధ్యన యుఎస్ లో సమంత చికిత్స తీసుకుంది. అయితే పూర్తిగా వ్యాధి నయం కాలేదు. దీనితో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగా లాంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తోంది.
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొంతకాలం అక్కడే ఉంది సామ్ ట్రీట్మెంట్ తీసుకోనుంది.
అయితే సమంత నెటిజన్లకు చిన్న షాక్ ఇచ్చింది. న్యూయార్క్ వెళ్ళగానే ఎంజాయ్ మూడ్ లోకి వెళ్ళిపోయింది సామ్. తన ఫ్రెండ్స్ తో కలసి సిటీ మొత్తం చక్కర్లు కొడుతోంది. చికిత్స అన్ని సమయాల్లో ఉండదు కాబట్టి సామ్ ఇలా ఎంజాయ్ చేస్తోంది అని అంటున్నారు.
తన స్నేహితులతో కలసి జిమ్ లో, రెస్టారెంట్స్ లో.. అందమైన ప్రదేశాల్లో సామ్ చక్కర్లు కొడుతోంది. జిమ్ లో సమంత షేర్ చేసిన పిక్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకర్షించే విధంగా ఉంది. ఆమె పక్కనే ఓ మిస్టరీ యువకుడు కూడా ఉన్నాడు.
ఇంతకీ అతడు ఎవరు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఖుషి ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టి యుఎస్ లో సామ్ చేస్తోంది ఇదా అని పెదవి విరుస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
ఇక సమంత న్యూయార్క్ లో భారతీయులు నిర్వహించిన ఇండియన్స్ ఇండిపెండెన్స్ పెరేడ్ కార్యక్రమంలో కూడా పాల్గొంది. చాలా హుషారుగా సమంత ర్యాలీలో పాల్గొని ఆకట్టుకుంది.