తలక్రిందులుగా యోగాతో పిచ్చెక్కిస్తున్న సమంత.. మీడియాకి చురకలు
సమంత తలక్రిందులుగా యోగా చేస్తుంది. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. లైఫ్ని బ్యాలెన్స్ చేయాలనే ఫిలాసఫీని చెబుతూనే ఫిట్నెస్లో కొత్త యాంగిల్స్ చూపిస్తుంది సామ్. ఈ సందర్భంగా మీడియాకి చురకలంటించడం విశేషం.
సమంత తన ఫిట్నెస్కి సంబంధించి నిత్యం యోగా చేస్తుందనే విషయం తెలిసిందే. కలుషితం లేని ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటోంది.
అయితే సామ్ ఇంత అందంగా, ఇంత ఫిట్గా ఉండటానికి కారణం ఆమె చేసే యోగా. దానితోనే తాను ఫిట్గా ఉంటానని, ఎనర్జిటిక్గా, ఉత్సాహంగా ఉంటానని చెప్పుకొచ్చిందీ భామ.
అందులో భాగంగా తాజాగా సరికొత్త యోగా ఆసనాన్ని పరిచయం చేసింది. తలక్రిందులుగా చేసే యోగా పోజులో ఫోటోని పంచుకుంటూ లైఫ్ కూడా తలక్రిందులైనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని జీవిత సత్యాన్ని, జీవిత పాఠాలను చెబుతుంది సమంత.
ఈ సందర్భంగా ఆమె పంచుకున్న తలక్రిందులు ఫోటోలు వైరల్గా మారింది. ఇదిలా ఉంటే దీనికి అదికా యోగా ఫిట్నెస్ ట్రైనర్ నీలమ్ మంగత్ ఆధ్వర్యంలో తాను ఈ యోగాసనం చేస్తున్నట్టు చెప్పింది సామ్.
మరోవైపు వైపు సమంత మీడియాకి చురకలంటించింది. ఫ్యాక్ట్ చెక్ విషయంలో తనమపై పెంచుతున్న ఒత్తిడిని ప్రతిబింబించేలా ఓ వీడియో గ్లింప్స్ ని రూపొందించింది సమంత.
`మేం ఎంటర్టైనర్స్. ఫ్యాక్ట్ చెకర్స్ కాదు` అని తెలిపింది సమంత. `ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మేం అభిప్రాయాన్ని కలిగి ఉన్నందుకు నటులను ఎందుకు నిలదీస్తార`ని ప్రశ్నించింది.
`మేం కూడా మనుషుం. మేం కూడా తప్పులు చేస్తాం. ప్రతి అంశంపై గట్టిగా మాట్లాడటం, ప్రతి విషయంపై మా అభిప్రాయాలు తీసుకోవడం, లేదంటే మమ్మల్ని రద్దు చేయడం అన్యాయం. మీకు అనిపించ లేదా? మేం మా పనులతో మిమ్మల్ని హంట్ చేస్తామని, మా నటనతో మిమ్మల్ని ప్రేమలో పడేస్తామని ?` అంటూ ప్రశ్నించింది.
`వాట్డిడ్షీసే` అనే యాష్ ట్యాగ్ వాడుతూ, ఇది మీ మనస్సుని మాట్లాడటానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం. మీ మనసులో ఏముంది?` అంటూ మనసులో ఉన్నది చెప్పేయండి అంటూ కుండబద్దలు కొట్టింది సమంత.
ఇటీవల సమాజంలో జరుగుతున్న ఘటనలపై అభిప్రాయాలు వెల్లడించాలని తమని ఫోర్స్ చేస్తున్నారని, తాము ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పే వాళ్లం కాదని పరోక్షంగా చెప్పుకొచ్చింది సామ్.
సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా నటిస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది సమంత.