కలవరపెడుతున్న సమంత మిస్సింగ్.. విదేశాల్లో ట్రీట్మెంట్.. ఇంతకి ఏమైంది?
స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజులుగా కనిపించడం లేదు. అంతకు ముందు బాలీవుడ్ షోలో మెరిసిన ఆమె చాలా కాలంగా కనిపించడం లేదు. ఆమెకు ఏమైందనేది ఇప్పుడు కలవరపెడుతుంది.
సమంత చేతిలో భారీ ప్రాజెక్ట్ లున్నాయి. ఆమె ఇంటర్నేషనల్ మూవీ కూడా చేస్తుంది. మరోవైపు బాలీవుడ్ సినిమాలు కూడా కన్పమ్ అయ్యాయి. తెలుగు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగా, మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంతకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సమంత ఎక్కడ ఉందనేది షాకిస్తుంది.
సమంత గత రెండు నెలలుగా కనిపించడం లేదు. ఆమె చిరవగా కరణ్ జోహార్ నిర్వహించే `కాఫీ విత్ కరణ్` షోలో మెరిసింది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఆ తర్వాత ఒకటి రెండు కార్యక్రమాల్లో మెరిసిన సామ్ సడెన్గా మాయమైంది. ఆమె ఎక్కడికెళ్లింది, ఏం జరిగిందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే సమంత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ఓ ఫోటో వైరల్ అయ్యింది.అందులో ఆమె తన ముఖాన్ని కప్పేసి ఉంది. దీంతో ఈ ఫోటోపై చర్చ నడిచింది. సమంత ముఖానికి ఏమైందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. అభిమానులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ మరో రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
ప్రస్తుతం సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఛర్మసంబంధిత సమస్యతో ఆమె బాధపడుతుందట. అందుకోసం ప్రస్తుతం అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటుందని టాక్. చాలా రోజులుగా అక్కడే ఉందట. ట్రీట్మెంట్కి రెండు నెలలు పడుతుందట. అందుకే సమంత మిస్సింగ్ అని తెలుస్తుంది. అంతకు ముందు సమంత తన గవదకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. తరచూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేది.
అందులో భాగంగా ఇప్పుడు ఆమె స్కిన్ డిసీజ్కి సంబంధించిన చికిత్స తీసుకుంటుందట. దాదాపు రెండు నెలలకుపైగానే దీనికి సమయం పడుతుందని తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం తనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ అమెరికా నుంచే చూసుకుంటుందట సమంత. ప్రస్తుతం సమంత `శాకుంతలం`, `యశోద`, `ఖుషి` చిత్రాలు చేస్తుంది. `శాకుంతలం`, `యశోద` షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. వీటికి సంబంధించి సమంత అమెరికా నుంచే మానిటరింగ్ చేస్తుందట.
అంతేకాదు ఇటీవల `యశోద` చిత్ర టీజర్ విడుదలైంది. అమెరికా నుంచే టీజర్ చూసి ఫైనల్ చేసిందట. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో ఆమెనే లీడ్ తీసుకుంటుందని, ఏసీన్ ఉండాలి, ఏది తీసేయాలనేది అక్కడ నుంచి సలహాలిస్తుందట. ఎందుకంటే ఈ చిత్రానికి సమంతనే సీనియర్. పైగా లీడ్ రోల్. దర్శకుల నుంచి మిగిలన వారంతా తనకంటే జూనియర్సే. అందుకే ఆ బాధ్యత మొత్తం తనే చూసుకుంటుందని సమాచారం.
అయితే `యశోద` చిత్రాన్ని ఆగస్ట్`లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది. బహుశా సమంత కారణంగానే వాయిదా పడుతుందని తెలుస్తుంది. ఆమె తన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగొచ్చాకే `యశోద` విడుదల ఉంటుందని తెలుస్తుంది. మరి అది ఎప్పుడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న `ఖుషి` టీమ్ కూడా సమంత కోసం వెయిటింగ్లో ఉన్నట్టు టాక్.