మరోసారి ఆసుపత్రి బెడ్ పై సమంత.. కంప్లీట్ ఎనెర్జీ, రోగనిరోధక శక్తి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న సామ్
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది.
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొన్ని రోజులు అక్కడ చికిత్స తీసుకుని తిరిగి వచ్చింది.
ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది. అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు.
మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా సమంత మరోసారి ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో షేర్ చేసింది. సెలైన్ తీసుకుంటున్న పిక్ అది. దీనితో సమంతకి మళ్ళీ ఏమైంది అంటూ అభిమానులు కాస్త కంగారు పడ్డారు.
అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమంత రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఆ సెలైన్ తీసుకుంటున్నట్లు ఆమె పోస్ట్ ద్వారా అర్థం అవుతోంది. సమంత తీసుకుంటున్న సెలైన్ ఇమ్యూనిటీ బూస్టర్ అట. దానివల్ల రక్తకణాల ఉత్పత్తి. రోగ నిరోధక శక్తి, కండరాల శక్తి, వైరస్ లని ఎదుర్కొనే శక్తి, ఎముకలకు శక్తి లాంటి ప్రయోజనాలు కలుగుతాయని సమంత పోస్ట్ లో పేర్కొంది.
దీనితో సమంత త్వరగా ఫుల్ ఎనేర్జితో కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా విష్ చేస్తున్నారు. ఇటీవల సమంత అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఆ లైవ్ సెషన్ లో సమంత ముఖంలో మార్పులు కనిపించాయి.
మీ స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్థం అవుతోంది. దీనితో ఓ అభిమాని మీ స్కిన్ కి ఏమైంది అని ప్రశ్నించారు. సమంత బదులిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది. ఆ స్టెరాయిడ్స్ ప్రభావం స్కిన్ పై ఇలా పడుతోంది అని సమంత తెలిపింది. మయో సైటిస్ నుంచి సామ్ కోలుకున్నప్పటికీ దాని నుంచి పూర్తిగా బయట పడలేదు.