దివాళి సెలబ్రేషన్స్ లో కరీనా, సైఫ్, మలైకా, అర్జున్ కపూర్, జాక్వెలిన్..అందరు ఒక్క చోటే..
బాలీవుడ్ సెలబ్రిటీలు దీపావళి పండుగ సెలబ్రేషన్లో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ వంటి తారాగణం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ దీపావళి పండుగని జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ దీపావళిని కొందరు స్టార్స్ సినిమా సెట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో సైఫ్, కరీనాల జోడీ, మలైకా, అర్జున్ కపూర్ల జోడీ కూడా ఉన్నారు.
సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్ కలిసి `బూత్ పోలీస్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. దీంతో అక్కడే ఈ దివాళిని సెలబ్రేట్ చేస్తున్నారు.
సైఫ్ ఇంటికి రాలేని పరిస్థితి నెలకొనడంతో ప్రెగ్నెంట్తో ఉన్న కరీనానే ఆయన వద్దకు వెళ్లింది. ధర్మశాలలో షూటింగ్ జరుగుతుండగా, అక్కడికి చేరుకున్నారు. ఇక అర్జున్ కపూర్ కోసం హాట్ బ్యూటీ మలైకా అరోరా వెళ్లడం విశేషం.
వీరంతా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. సైఫ్, కరీనా బోగి మంటల వద్ద చలి కాచుకుంటున్న వీడియోని పంచుకున్నారు.
ఇక మలైకా సైతం సరికొత్తగా పార్టీ వేర్ ధరించి కనువిందు చేసింది. కరీనాతో కలిసి సందడి చేసింది.
మరోవైపు కొత్త డ్రెస్లో యువరాణిలా ముస్తాబైన మలైకా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మలైకా లుక్ చూసి ఆమె అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇంతటి అందాన్ని చూసి వాహ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు జాక్వెలిన్ సైతం వీరితో సందడి చేసింది.
హాట్ అందాలను ఒలకబోస్తూ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లలో హీటు పుట్టిస్తున్నాయి.