ఛోటా కె నాయుడి తమ్ముడి అరెస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన నటి
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన వివాదం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు అరెస్ట్. ఓ నటి తనను శ్యామ్ మోసం చేశాంటూ కంప్లయింట్ ఇవ్వటంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..!
పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన సాయి సుథ, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ సంజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కంప్లయింట్పై విచారణ జరిపిన పోలీసులు శ్యామ్ కే నాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చాలా కాలంగా శ్యామ్ తనతో రిలేషన్ షిప్లో ఉన్నాడని చెప్పిన సాయి సుథ ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తనకు దూరమయ్యాడని. ఇన్నాళ్లు తనను వాడుకొని మోసం చేశాడంటూ ఆమె కంప్లయిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.
అయితే ఈ వివాదం తరువాత ఓ యూట్యూబ్ చానల్తో మాట్లాడిన సాయి సుథ అసలేం జరిగిందో వివరించింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాడీగార్డ్ సినిమా సమయంలో శ్యామ్తో సాయి సుధకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత షాడో సినిమాకు కూడా కలిసి పనిచేయటంతో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది.ఆ తరువాత కొంత కాలం సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్న ఇద్దరు, తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఆ సమయంలోనే శ్యామ్ ప్రపోజ్ చేయటంతో సాయి సుధ అంగీకరించింది., శ్యామ్కు అప్పటికే పెళ్లైన విషయం తెలిసే తాను అంగీరించానని చెప్పింది సాయి సుథ.
అయితే శ్యామ్కు భార్యతో వివాదాలు ఉండటంతో ఆమె కూడా తనకు ఫోన్ చేసి బెదిరించేదని సాయి సుథ వివరించింది. ఈ విషయంపై శ్యామ్ను గట్టిగా అడగటంతో మా ఇద్దరి మధ్య కూడా తరుచూ గొడవలు జరిగేవని సాయి సుథ తెలిపింది. ఆ సమయంలోనే ఇద్దరి విడిపోదమని అనుకున్ాన కొంత మంది తిరిగి కలిపారని. తరువాత నేను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో శ్యామ్ పూర్తిగా ముఖం చాటేశాడని వివరించింది.
శ్యామ్ వల్ల శారీరకంగా, మాసికంగా, ఆర్థికంగా చాలా నష్టపోయానని తెలిపింది. ఒక సమయంలో ఆయన ఖర్చులన్నీ నేనే భరించానని, అప్పట్లో నమ్మకంతో ఎంత ఖర్చు పెట్టానోకూడా లెక్క చూసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిజికల్ గా కూడా చాలా క్లోజ్గా ఉన్నాం. అందుకే అతను నాకు కావాలని కోరుకున్నాను అంటూ వివరించింది. అతని వల్ల నేను నా కుటుంబానికి కూడా దూరమయ్యానని తెలిపింది. అతడితో రిలేషన్ మొదలు పెట్టే ముందే అతడు ఎలాంటి వాడు తెలుసుకొని ఉండే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసింది.