సాయి పల్లవి పెళ్లి చేసుకోదా, అందుకే చెల్లి ఈ పని చేసిందా? అక్క కంటే ముందే!
సాయి పల్లవికి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. త్వరలో ఆమె చెల్లెలు ప్రియుడిని వివాహం చేసుకోనుంది. ఈ విషయాన్ని పూజా కన్నన్ స్వయంగా తెలియజేసింది.
Sai Pallavi
అక్క కంటే ముందు పెళ్లి పీటలు ఎక్కుతుంది పూజా కన్నన్. సాయి పల్లవి చెల్లెలు ప్రియుడిని పరిచయం చేసింది. నా లైఫ్ పార్ట్నర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. విషయంలోకి వెళితే... పూజా కన్నన్ కూడా నటిగా ప్రయత్నం చేసింది.
Pooja Kannan
2021లో విడుదలైన చిత్తిరాయి సెవ్వానం అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. సముద్ర ఖని మరో ప్రధాన పాత్ర చేశాడు. ఈ మూవీ కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. మళ్ళీ పూజ కన్నన్ నటించలేదు. ఆమె సోషల్ వర్కర్ అని సమాచారం.
Sai Pallavi
తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా పెళ్లి మేటర్ లీక్ చేసింది. ప్రియుడిని పరిచయం చేసింది. ఇతని పేరు వినీత్, నా ఆశాకిరణం. నా క్రైమ్ పార్ట్నర్, ఇప్పుడు పార్ట్నర్ అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో పూజా కన్నన్ , వినీత్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు స్పష్టత వచ్చింది.
సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు...
దీంతో అక్క సాయి పల్లవి కంటే ముందు పూజా కన్నన్ వివాహం చేసుకోనుందని క్లారిటీ వచ్చింది. మరోవైపు సాయి పల్లవి వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో కొంచెం బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి నాగ చైతన్యకు జంటగా తండేల్ అనే మూవీ చేస్తుంది.
Sai Pallavi
ఈ చిత్రానికి కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇది ఎమోషనల్ లవ్ డ్రామా అని సమాచారం. నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్నాడు. గతంలో సాయి పల్లవి-నాగ చైతన్య కాంబోలో విడుదలైన లవ్ స్టోరీ విజయం సాధించింది.
ఈ చిత్రానికి కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇది ఎమోషనల్ లవ్ డ్రామా అని సమాచారం. నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్నాడు. గతంలో సాయి పల్లవి-నాగ చైతన్య కాంబోలో విడుదలైన లవ్ స్టోరీ విజయం సాధించింది.