నల్లగా ఉన్నానని అవమానించారు... తన రంగుపై రోజా సంచలన కామెంట్స్!
నటి ఎమ్మెల్యే రోజా చెన్నైలో జరిగిన ఓ వేదిక సాక్షిగా తన శరీర రంగుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ బిగినింగ్ లో తనను చాలా మంది నల్లగా ఉన్నవని కామెంట్స్ చేశారని ఆమె అన్నారు.
సౌత్ ఇండియా సినీ,టీవీ మేకప్ ఆర్టిస్ట్-హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వరంలో విరుగంబాక్కంలోని ఏవీఎం కాలనీ, కామరాజర్ శాలైలో నెలకొల్పిన హెచ్జే సినీ మేకప్ హెయిర్, బ్యూటీ అకాడమీ ప్రారంభ కార్యక్రమానికి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో రోజా మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో తన శరీర రంగుపై కొందరు కామెంట్ చేశారు. అయితే మేకప్ ఆర్టిస్ట్స్ తమ నైపుణ్యంతో తనను అందంగా చూపించారని రోజా అన్నారు. వెండితెరపై తాను స్టార్ గా ఎదగడానికి కారణం మేకప్ ఆర్టిస్టులే అని ఆమె అన్నారు.
తనను వెండితెరపై అందంగా చూపించి కెరీర్ లో ఎదిగేలా చేసిన మేకప్ ఆర్టిస్ట్స్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకు తనను అతిథిగా ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఇక రాజకీయాలలో తాను అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు రోజా తెలిపారు. పాలిటిక్స్ లో తనకు ఎంత కష్టం వచ్చినా దివంగత జయలలితగారిని తలచుకుంటే కొండత ధైర్యం వస్తుందని రోజా అన్నారు. రాజకీయాలలో తనకు స్ఫూర్తి జయలలితగారే అంటూ రోజా చెప్పుకొచ్చారు.
1999లో రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2014లో వైఎస్సార్ పార్టీలో జాయిన్ అయిన ఆమె రెండు సార్లు నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజకీయాలలో రాణిస్తూనే బుల్లితెర షోలకు జడ్జ్ గా, నటిగా ఆమె కొనసాగుతున్నారు. పాప్యులర్ కామెడీ షో జబర్థస్త్ కి రోజా ఏళ్లుగా జడ్జ్ గా ఉన్నారు.