నోరు విప్పిన రియా.. సుశాంత్ డబ్బు వాడుకోవటంపై క్లారిటీ
శుక్రవారం ఈడీ ఎదుట హాజరైన రియాను దాదాపు 9 గంటల పాటు విచారించారు. ఆమె ఆర్ధిక లావాదేవిలతో పాటు సుశాంత్ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వ్యవహారాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రియా తన ఆస్తులుకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా బాలీవుడ్ మాఫియా కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడన్న ఆరోపణలు వినిపించినా తాజాగా అందరి వేళ్లు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వైపే చూపిస్తున్నాయి.
రియా సుశాంత్ను ఆర్ధికంగా, మానసికంగా ఎంతో వేదించిందని అందుకే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి భారీగా రియా అకౌంట్ డబ్బు బదీలి అయినట్టుగా వారు పోలీసులకు తెలిపారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ రియా చక్రవర్తిని విచారించింది. శుక్రవారం ఈడీ ఎదుట హాజరైన రియాను దాదాపు 9 గంటల పాటు విచారించారు. ఆమె ఆర్ధిక లావాదేవిలతో పాటు సుశాంత్ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వ్యవహారాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రియా తన ఆస్తులుకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ నుంచి తాను ఎప్పుడూ డబ్బు తీసుకోలేదని రియా వెల్లడించింది. తర ఖర్చులన్నీ తన సొంత అకౌంట్ నుంచి ఖర్చు పెట్టేదాన్నని ఆమె ఈడీకి తెలిపినట్టుగా తెలుస్తోంది. సుశాంత్ ప్రారంభించిన కంపెనీలో కూడా తన సోదరుడితో కలిసి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టుగా ఆమె వెల్లడించింది.
ఇక ఈస్ట్ ముంబైలోని ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది రియా. ఆ ఫ్లాట్ కొనుగోలు కోసం 25 లక్షల తన సొంత డబ్బుతో పాటు దాదాపు 60 లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్టుగా ఆమె ఈడీ అధికారులకు తెలిపింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ కేసు వేసిన నేపథ్యంలో రియాతో పాటు ఆమె సోదరుడు, తల్లి దండ్రులు, సుశాంత్ బిజినెస్ మేనేజర్, హౌస్ మేనేజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా విచారించిన పోలీసులు త్వరలో రియా తండ్రిని కూడా విచారించనున్నారు.