రష్మిక మాజీ ప్రియుడితో ఇంకా టచ్ లోనే ఉందా... బయటపడ్డ రహస్యం!
రష్మిక మందన్నా మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి క్యాన్సిల్ అయినా ఆమె టచ్ లో ఉందన్న రహస్యం బయటపెట్టాడు. రక్షిత్ శెట్టి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ రష్మిక మందాన తొలినాళ్లలోనే ప్రేమలో పడింది. ఆమె మొదటి చిత్రం కిరిక్ పార్టీ. ఈ కన్నడ చిత్రంలో రక్షిత్ శెట్టి హీరో. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. కిరిక్ పార్టీ సూపర్ హిట్. ఆ మూవీ సెట్స్ లో రక్షిత్ శెట్టి-రష్మిక మందాన ప్రేమలో పడ్డారు. వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. సడన్ గా రష్మిక మందాన మనసు మారింది. పెళ్లి ఆలోచన వదిలేసింది.
రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. రష్మికపై రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశాడు. సంయమనం పాటించండి. రష్మికను వేధించవద్దని కోరుకున్నాడు. రక్షిత్ శెట్టి తో విడిపోయిన రష్మిక తన ఫోకస్ టాలీవుడ్ మీద పెట్టింది. ఛలో మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ చిత్రం సూపర్ హిట్.
గీత గోవిందం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఏకంగా మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. అలా స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది. ప్రస్తుతం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా దున్నేస్తుంది. అయితే రష్మిక మందాన ఇప్పటికీ మాజీ ప్రియుడితో టచ్ లో ఉందట. ఈ విషయం స్వయంగా రక్షిత్ శెట్టి చెప్పాడు.
రక్షిత్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రష్మికతో పల్లి క్యాన్సిల్ అయినా మేము టచ్ లోనే ఉన్నాము. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాము. రష్మికకు పెద్ద కలలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని సాకారం చేసుకుంటుంది, అన్నాడు. దీంతో వాళ్ళ మధ్య విబేధాలు లేవని, ఒకరి నిర్ణయం మరొకరు గౌరవించుకుంటున్నాన్న క్లారిటీ వచ్చింది.
మరోవైపు రష్మిక హీరో విజయ్ దేవరకొండను ప్రేమిస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. కలిసి విహారాలకు వెళుతున్నారు. రష్మిక మందాన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. యానిమల్ మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది.