సముద్రపు సొరచేపలా రష్మిక మందన్నా కనువిందు.. సక్సెస్ జోరులో ట్రీట్ ఇస్తున్న నేషనల్ క్రష్..
రష్మిక మందన్నా ఓ వైపు భారీ ప్రాజెక్ట్ లు, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించబోతుంది. ఇంకోవైపు గ్లామర్ ఫోటోలతో ట్రీట్ ఇచ్చిందీ నేషనల్ క్రష్.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వరుస విజయాలతో ఉన్న ఆమె లేటెస్ట్ గా సముద్రపు ఒడ్డున బీచ్ అందాలను ఆవిష్కరించింది. బికినీలో మెరిసింది. సముద్రపు సొరచేపలా మెరిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది నేషనల్ క్రష్. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రావెల్ లీజర్ మేగజీన్ కోసం ఫోటో షూట్ చేసింది రష్మిక. ఈ పిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సక్సెస్ జోరులో ఉంది. `యానిమల్` మూవీ ఇచ్చిన సక్సెస్ ఆమెని నెక్ట్స్ లెవల్ హీరోయిన్ని చేసింది. దీంతో నేషనల్ వైడ్గా చర్చనీయాంశంగా మారడమే కాదు, అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే భారీ ఆఫర్లని దక్కించుకుంటుంది.
రష్మిక మందన్నా ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో నటించే ఆఫర్ని అందుకున్న విషయం తెలిసిందే. `సికందర్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. దీనికి మురుగదాస్ దర్శకుడు.
మరోవైపు ఇప్పుడు రష్మిక మందన్నా.. శ్రీవల్లిగా సందడి చేయబోతుంది. `పుష్ప2`లో ఆమె హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. నేషనల్ వైడ్గా ఈ సినిమాకి క్రేజ్ ఉంది. ఈ మూవీ హిట్ అయితే రష్మిక రేంజ్ ఇండియా వైడ్గా మారుమోగుతుందని చెప్పొచ్చు.
రష్మిక మందన్నా ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. ఆమె `ది గర్ల్ ఫ్రెండ్`, `రెయిన్బో` చిత్రాలు అలాంటి ఇతి వృత్తంతోనే తెరకెక్కుతున్నాయి. ఇందులో నటిగా తానేంటో నిరూపించుకోబోతుంది. అలాగే ధనుష్, నాగార్జున నటిస్తున్న `కుబేరా`లోనూ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు తన ప్రియుడు విజయ్ దేవరకొండతోనూ మళ్లీ సినిమా చేయబోతుందట. రాహుల్ సాంక్రిత్యాన్ చిత్రంలో ఆమె హీరోయిన్గా ఎంపికైందని తెలుస్తుంది. ఇది హిస్టారికల్ మూవీగా రూపొందుతుంది. త్వరలోనే స్టార్ట్ కానుంది.
రష్మిక మందన్నా చాలా యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. వారికి టచ్లో ఉంటూ ఎంటర్టైన్ చేస్తుంది. అదే సమయంలో పాజిటివ్ నేచర్తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు సెలక్టీవ్గా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.