- Home
- Entertainment
- Rashmika Love Tips: నాకింకా ఆ వయసు రాలేదంటూ మ్యారేజ్పై నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్.. ట్రెండింగ్
Rashmika Love Tips: నాకింకా ఆ వయసు రాలేదంటూ మ్యారేజ్పై నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్.. ట్రెండింగ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమ, రిలేషన్షిప్, మ్యారేజ్పై స్పందించింది. తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పేసింది. అంతేకాదు ప్రేమ గురించి కొన్ని చిట్కాలు కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు వైరల్గా మారింది.

రష్మిక మందన్నా(Rashmika Mandanna).. నేషనల్ క్రష్గా పాపులర్ అయ్యిందీ భామ. హీరోయిన్గా కెరీర్ని ప్రారంభించిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఊహించని బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్లతో స్టార్డమ్ని సొంతం చేసుకుని ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. చలాకీతనం, చిలిపితనం, అన్లిమిటెడ్ ఎనర్జీ సొంతం చేసుకున్న రష్మిక క్రేజీ స్టార్గా నిలుస్తుంది. స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుంది.
ప్రస్తుతం తెలుగులో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తున్న Rashmika.. బాలీవుడ్లోనూ దూసుకుపోతుంది. అక్కడ మూడు సినిమాలు `మిషన్ మజ్ను`, `గుడ్బై` తోపాటు మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు తమిళంలోనూ విజయ్తో చేయబోతుంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక.. తాజాగా లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్పై స్పందించింది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ముంబయిలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ, ప్రేమలో మాట్లల్లో వర్ణించలేమని చెప్పింది. అది కేవలం ఫీలింగ్కి సంబంధించినదని, దాన్ని మాటల రూపంలో వ్యక్తం చేయడం కష్టమని పేర్కొంది. రిలేషన్షిప్లో ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవాలని, అదే సమయంలో గౌరవించుకోవాలని, అప్పుడే అది ప్రేమగా మారుతుందని, లవ్ రెండు వైపులా ఉంటేనే ఆ రిలేషన్ బలపడుతుందని, ముందుకు సాగుతుందని చెప్పింది రష్మిక.
ఇక తన మ్యారేజ్పై రష్మిక స్పందిస్తూ, ప్రస్తుతానికి మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. ప్రస్తుతం తనకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని చెప్పింది. పెళ్లి గురించి ఎలా ఆలోచించాలో తెలియడం లేదని, పెళ్లికి సంబంధించిన థాట్స్ ని తన మనసులోకి రానివ్వడం లేదని చెప్పింది చెప్పింది రష్మిక.
అయితే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో మాత్రం రివీల్ చేసింది. ఎవరైతే ప్రేమగా, సురక్షితంగా చూసుకుంటారో వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తను కూడా ప్రేమకే ప్రయారిటీ ఇస్తారనే విషయాన్ని వెల్లడించిందీ నేషనల్ క్రష్. ప్రస్తుతం రష్మిక చెప్పిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రష్మిక చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాళ్లు క్యూలో నిల్చునే పనిలో పడ్డారు.
ఇటీవల అల్లు అర్జున్తో కలిసి `పుష్ప` చిత్రంలో నటించి ఆకట్టుకుంది రష్మిక. శ్రీవల్లిగా డీ గ్లామర్ రోల్లో మెప్పించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది రష్మిక. అయితే అంతకు ముందే కన్నడ, తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేసిన నేపథ్యంలో ఆమెకి అన్ని భాషల్లోనూ పాపులారిటీ ఉంది. కానీ `పుష్ప`తో ఇండియా వైడ్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంతోపాటు `పుష్పః ది రూల్` సినిమాతోనూ సందడి చేసేందుకు రెడీ అవుతుంది.
శర్వానంద్, రష్మిక మందన్నాతోపాటు ఖుష్బు, రాధికా, ఝాన్సీ వంటి వారు కలిసి నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా బిజీగా గడుపుతుంది రష్మిక మందన్నా.