తనని తాను పందితో పోల్చుకున్న రష్మిక మందన్నా.. ఇదేం పోయే కాలమో..
ఇటీవల లగ్జరీ కారు కొని హంగామా చేసిన క్రేజీ బ్యూటీ రష్మికా మందన్నా ఇప్పుడు ఓ సంచలన కామెంట్ చేస్తుంది. ఆ కామెంట్ ఎవరిపైనో కాదు, తనపైనే చేసుకుంది. తనని తాను పందితో పోల్చుకుంది. తాను పిగ్లాగానే కనిపిస్తానని వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చిందీ మహేష్ హీరోయిన్.
వరుసగా బిగ్ ప్రాజెక్ట్ లను దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా తన ఇన్స్టా స్టోరీస్లో అభిమానులు షాక్ అయ్యే కామెంట్ పెట్టుకుంది.
సడెన్గా చూస్తే, ఒక్క సెకెన్ నేను కూడా ఇలానే కనిపిస్తాను అని పంది ఫోటోని పెట్టింది రష్మిక.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నీకు ఇదేం పోయే కాలం అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆమెని సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కోటి విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొని షాక్ ఇచ్చిందీ బ్యూటీ. తన స్థాయి హీరోయిన్లలో ఎవరికీ ఈ రేంజ్లో లగ్జరీ కారు లేదు. బట్ తనకు ఎయిర్పోర్ట్ కి రావడం పోవడం ఇబ్బంది అవుతుందని కారు కొన్నట్టు చెప్పింది.
కారు కొంటానని ఎప్పుడూ అనుకోలేదని, ఈ స్థాయికి చేరుకోవడానికి అభిమానులే కారణమని తెలిపింది. వారికి తన కారుని అంకితమిచ్చింది.
`గీత గోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగులో `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్కి జోడీగా నటిస్తుంది.
మరోవైపు హిందీలో బ్యాక్ టూ బ్యాక్రెండు భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది. ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి `మిషన్ మజ్ను`, అలాగే అమితాబ్ బచ్చన్ సినిమాకి సైన్ చేసింది. బాలీవుడ్లో రాణించడం తన డ్రీమ్ అని, అక్కడ అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పింది రష్మి.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక ఇలా బ్యాక్ టూ బ్యాక్ భారీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకుపోవడం విశేషం.
టాలెంట్ ఉంటే ఎక్కడైనా రాణించడం సాధ్యమే అనేందుకు నిదర్శనంగా నిలుస్తుందీ క్యూట్ అందాల భామ. మరో వైపు తెలుగులో `ఆడాళ్లు మీకు జోహార్లు` అనే సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నట్టు సమాచారం.