మనీష్ మల్హోత్రా నైట్ పార్టీలో విజయ్, పూరి , కియారా, సారా, రకుల్ సందడి!
ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా నైట్ పార్టీలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ తారలు సందడి చేశారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాద్, ఛార్మి సైతం ఈ పార్టీలో కనిపించడం ఆసక్తి కలిగిస్తుంది.
ప్రతి ఏడాది మనీష్ మల్హోత్రా బాలీవుడ్ తారలకు ప్రత్యేకంగా గ్రాండ్ పార్టీ ఇస్తారు. బాలీవుడ్ నుండి ప్రముఖ హీరోలు,హీరోయిన్స్ ఈ పార్టీకి హాజరు కావడం ఆనవాయితీగా ఉంది .
ఈ ఏడాది కూడా మనీష్ పార్టీ ఏర్పాటు చేయగా బాలీవుడ్ నుండి కియారా అద్వానీ, పరిణితీ చోప్రా, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ అటెండ్ కావడం జరిగింది.
ఇక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ పార్టీలో మెరవడం జరిగింది. పూరి-విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ చిత్రానికి సహనిర్మాతగా కరణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
రకుల్ బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో సో స్టైలిష్ గా కనిపించారు. ఆమె లుక్ సెక్సీగా ఉంది.
సారా అవుట్ అండ్ అవుట్ వైట్ ట్రెండీ డిజైనర్ వేర్ లో సెగలు పుట్టించేలా ఉన్నారు.
photo courtesy: viral bhayani
ఇక కియారా వైట్ కోట్ టాప్, గ్రీన్ ప్యాంట్స్ ధరించి కాంట్రాస్ట్ కలర్స్ స్టైల్ లో మెరిసిపోయారు.
photo courtesy: viral bhayani
పరిణితీ చోప్రా సైతం వైట్ టాప్, బ్లాక్ ప్యాంట్స్ ధరించి అల్ట్రా స్టైలిష్ గా కనిపించారు.
photo courtesy: viral bhayani