MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజేంద్ర ప్రసాద్ కోట్ల విలువ చేసే ఆస్తులు దోచేసింది ఎవరో తెలుసా..మొత్తం గోకేశారు, బెజవాడలో అది మాత్రమే

రాజేంద్ర ప్రసాద్ కోట్ల విలువ చేసే ఆస్తులు దోచేసింది ఎవరో తెలుసా..మొత్తం గోకేశారు, బెజవాడలో అది మాత్రమే

కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ టాలీవుడ్ లో బిజీ గా క్యారెక్టర్ రోల్స్ లో రాణిస్తున్నారు. ఒకప్పుడు తాను ఏడాదికి 12, 13 చిత్రాల్లో నటించానని ఇప్పటికీ మంచి పాత్రల్లో నటిస్తున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

2 Min read
Tirumala Dornala
Published : Oct 17 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ టాలీవుడ్ లో బిజీ గా క్యారెక్టర్ రోల్స్ లో రాణిస్తున్నారు. ఒకప్పుడు తాను ఏడాదికి 12, 13 చిత్రాల్లో నటించానని ఇప్పటికీ మంచి పాత్రల్లో నటిస్తున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె గాయత్రీ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. దీనితో రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ శోక సంద్రంలో ఉన్నారు. 

25

అయితే రాజేంద్రప్రసాద్ 80 వ దశకం నుంచే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఆ ఒక్కటీ అడక్కు, అహనా పెళ్ళంట, రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో రాజేంద్రప్రసాద్ నటించారు. అయితే ఆయన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదట. ఇబ్బంది కూడా పెట్టలేదు. నా రేంజ్ ని నేను లెక్క వేసుకోలేదు.  ఇచ్చినంత పుచ్చుకున్నాను. ఆ డబ్బుతోనే ఆస్తులు సంపాదించా అని రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

35

కోట్ల విలువచేసే ఆస్తులు ఎన్నో సంపాదించా. కానీ ఇప్పుడు ఏమీ లేవు. నా అనుకున్న వారే నన్ను కోసం చేసి కాజేశారు. వాళ్ళు ఎవరు అని అడిగితే రాజేంద్ర ప్రసాద్ పేర్లు చెప్పలేదు. నా రక్త సంబంధమే కదా అని నమ్మాను. ఆస్తులు ఏవి అని అడిగితే చేతులు ఎత్తేశారు. బెజవాడ బెంజ్ సర్కిల్ లో కాంప్లెక్స్ మాత్రమే మిగిలింది అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 

Also Read : ఆమెతో డ్యాన్స్ చేసిన స్టార్ హీరోకి మోకాళ్ళు వాచిపోయాయి

45

కానీ దర్శకుల ఇప్పటికీ నా కోసమే పాత్రలు రాయడం చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. నేను ఇప్పటికీ ఎనర్జిటిక్.. బతికున్నంత కాలం నటిస్తూనే ఉంటా. అనిల్ రావిపూడి లాంటి యువ దర్శకులు నా కోసం పాత్రలు రాస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్ర కథ అనిల్ చెబుతుంటే.. కథ నాకు చెబుతున్నావా రాజేంద్ర ప్రసాద్ గారికి చెబుతున్నావా అని మహేష్ సరదాగా అన్నారు. 

55

రాజేంద్ర ప్రసాద్ చివరగా ప్రభాస్ కల్కి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. కామెడీ హీరోగా టాప్ స్టార్ డమ్ చూసిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
Recommended image2
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
Recommended image3
Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved