పాపం చార్మీ.. ఆ నిర్ణయం వల్ల 200 కోట్లు మిస్ , లైగర్ దెబ్బ మామూలుగా తగల్లేదు మరి
లైగర్ దెబ్బ మామూలుగా తగల్లేదు.. విజయ్ దేవరకొండతో పాటు, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ లకు బిగ్ షాక్ తగిలింది. ఏదో అనుకుంటే మరేదో జరిగింది. భారీ కలెక్షన్లు సాధిస్తుంది అనుకున్న సినిమా డీలా పడటంతో.. గతంలో వచ్చిన ఓ భారీ ఆఫర్ తలుచుకుని బాధపడుతుందట చార్మీ.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్.. ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఫస్ట్ డేనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది మూవీ.. అడ్వాన్స్ బుకింగ్స్ తప్పించి.. ఆతరువాత థియేటర్లు కొన్ని చోట్ల అస్సలు ఫిల్ అవ్వలేదు.
ఈ సినిమా ఇలా అవుతుంది అని తెలియక భారీ ఆఫర్ ను మిస్ అయ్యామన్నారు చార్మీ. విజయ్, పూరీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం సమయంలో మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సమయంలో మాకు ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చింది. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ డీల్ని కాదనుకున్నాం అన్నారు.
అయితే అది మామూలు ఆఫర్ కాదు.. ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల వరకూ ఇస్తామంటూ వారు ముందు వచ్చారు. కాని ఈ నిమాపై మాకు ఉన్న పూర్తి నమ్మకం.. ఆభారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసేలా చేసింది అన్నారు చార్మీ. అందుకు పూరీ గారికి ఎన్ని ఘట్స్ కావాలి అంటూ చార్మీ ఆ సీక్రెట్ ను రివీల్ చేసింది. ఈ విషయం చెబుతూ ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది.
కొంగు జార్చి సెక్సీగా ఛార్మి ఫోజు
ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారు చేస్తున్న కామెంట్స్ ప్రకారం.. ఈ సినిమాకి ఓటీటీ డీల్ . 200 కోట్లు వారు ఎందుకు కాదని అనుకున్నారో? ఇంతోటి సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందో? అంటూ ఛార్మిని, పూరిని టార్గెట్ చేస్తూ వరుస కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే అంటున్నారు సినీ జనాలు. అంతే కాదు సినిమా ప్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో.. ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక వారి చేతులతో వారే.. 200 కోట్లు వచ్చిపడుతుంటే కాలితో కాదని తన్నినట్టు అయ్యిందని బాధపడుతున్నారట. ఈ విషయం బయటకు చెప్పుకోకున్నా.. లోపల ఈ విషయంలో బాగా డిస్సపాయింట్ అయ్యి ఉన్నారట టీమ్.