పూరి జగన్నాధ్ కి బాగా నచ్చిన సినిమా డైలాగ్స్ ఏంటో తెలుసా.. పోకిరి కాదట
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరోయిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో స్పెషలిస్టు. ఆయన చిత్రాల్లో హీరో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. పూరి జగన్నాధ్ తన హీరోలకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో లాగా భారీ డైలాగులు, బిల్డప్ లు ఇవ్వరు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరోయిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో స్పెషలిస్టు. ఆయన చిత్రాల్లో హీరో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. పూరి జగన్నాధ్ తన హీరోలకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో లాగా భారీ డైలాగులు, బిల్డప్ లు ఇవ్వరు. హీరో పాత్రకి కాస్త ఆకతాయి తనం, పొగరు జోడించి దానినే హైలైట్ చేసి చూపిస్తారు.
పోకిరి, బిజినెస్ మాన్ చిత్రాలు అందుకు ఉదాహరణ. పూరి జగన్నాధ్ చిత్రాల్లో వన్ లైన్ పంచ్ డైలాగ్స్ బాగా పేలుతాయి. పోకిరిలో డైలాగ్స్ అయితే అప్పట్లో యువతని ఉర్రూతలూగించాయి. ఎప్పుడొచ్చాం అన్నది కాదు అన్నయ్య.. బులెట్ దిగిందా లేదా లాంటి డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే పూరి జగన్నాధ్ కి తన చిత్రాల్లో తనకి బాగా నచ్చిన డైలాగ్స్ ఉండేది పోకిరిలో కాదట. ఈ విషయాన్ని మహేష్ బాబు ఒక సందర్భంలో చెబుతూ వివరించారు. బిజినెస్ మ్యాన్ కథ రెడీ చేస్తున్నప్పుడు పూరి జగన్నాధ్ మహేష్ కి ఫోన్ చేశారట.
డైలాగులు అద్భుతంగా వచ్చాయి మహేష్.. నా సినిమాలన్నింటి లోకి ఇవే బెస్ట్ డైలాగ్స్ అని తెగ ఎగ్జైట్ అయ్యారని మహేష్ బాబు చెప్పారు. అనుకున్నట్లుగానే బిజినెస్ మ్యాన్ సినిమా డైలాగ్స్ పరంగా సంచలనం సృష్టించింది. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు..కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా లాంటి డైలాగ్స్ బాగా హైలైట్ అయ్యాయి.
పోకిరి, బిజినెస్ మాన్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్ లో జనగణమన అనే చిత్రం రావాల్సింది. కానీ ఆ చిత్రాన్ని మహేష్ ప్రారంభ దశలోనే రిజెక్ట్ చేశారు.
ఆ కథతో ఎప్పటికైనా సినిమా చేస్తానని పూరి జగన్నాధ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ జోరు బాగా తగ్గింది. పూరి చివరగా తెరకెక్కించిన లైగర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రం చేస్తున్నారు.