పలచని చీరలో అయస్కాంతంలా లాగేస్తున్న ప్రణీత సుభాష్.. ఊరించే ఫోజులు వైరల్
ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hp6dn3r6n1af3pxwer565tgk/7-jpg_300x378xt.jpg)
ఈ చిత్రం నుంచే ప్రణీతని అభిమానులు బాపు బొమ్మ అని పిలవటం ప్రారంభించారు. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస , బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది.
ఇదిలా ఉండగా ప్రణీత 2021 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత వివాహం తర్వాత కూడా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
తాజాగా ప్రణీత తన సొగసుతో మురిపించే ఫోజులు ఇచ్చింది. ప్రణీత పూర్తిగా లుక్కు మార్చేసి సర్ప్రైజ్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో కూడా ఎంత హాట్ గా కనిపించాలో అలాగే కనిపిస్తూ కవ్విస్తోంది.
పలచని చీరలో మైండ్ బ్లాక్ అయ్యే విధంగా టాప్ టు బాటమ్ సొగసుతో కవ్వింపు చర్యలు మొదలు పెట్టింది. ఆమె ధరించిన పలచని చీర ఎలా ఉందంటే.. ఒక వలని శరీరానికి చుట్టేసుకునట్లు అనిపిస్తోంది.
ఇంత సొగసు ఉంటే బాపు బొమ్మ కాక మరేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రణీత వల్లే చీరకి అంత అందం వచ్చింది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రణీత నిజంగానే బాపు బొమ్మ అంటూ కీర్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉందా అనే ప్రచారం కూడా మొదలయింది. అందుకే ఇలా సోషల్ మీడియాలో హాట్ షోకి తెరలేపింది అని కామెంట్స్ చేస్తున్నారు.