పూజ హెగ్డే జస్ట్ మిస్ అయ్యింది... లేదంటే డబుల్ హ్యాట్రిక్ కొట్టేది!
పూజ హెగ్డే వరుస ప్లాప్స్ తో సతమతం అవుతుండగా మరో ప్లాప్ జస్ట్ మిస్ అయ్యింది. లేదంటే డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసేది. ఆ మేటర్ ఏంటో చూద్దాం...
పూజ హెగ్డే కెరీర్ బిగినింగ్ నుండి ఒడిదుడుకులే. అయితే ఓ మూడేళ్లు ఆమెకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న పూజ హెగ్డేకు దర్శకుడు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkwyw2047cha1nhd5vj0k5ve/poo--6-_300x375xt.jpg)
ఆ టైం లో ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. అరవింద సమేత హిట్ కావడంతో మహేష్ పక్కన మహర్షి లో ఛాన్స్ పట్టేసింది. అది కూడా హిట్. ఇక అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. పూజ హెగ్డే పట్టిందల్లా బంగారం అయ్యింది.
అయితే 2022 నుండి ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రాధే శ్యామ్ మూవీతో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతుంది. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వరుస ప్లాప్ అయ్యాయి.
ఈ క్రమంలో మహేష్ బాబుకు జంటగా త్రివిక్రమ్ మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఇది ఆమెకు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది . త్రివిక్రమ్ మరోసారి ఆమెను హిట్ ట్రాక్ ఎక్కిస్తాడని భావించారు. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి పూజ హెగ్డే తప్పుకుంది.
అందుకు చాలా కారణాలు వినిపించాయి. మెయిన్ హీరోయిన్ గా తీసుని సెకండ్ హీరోయిన్ చేశారని ప్రధానంగా వినిపించిన కారణం. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకే ప్రాజెక్ట్ వదిలేసిందని ఓ సందర్భంలో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెప్పారు.
అయితే గుంటూరు కారం మూవీ నుండి తప్పుకుని ఆమె మంచి పని చేసింది. లేదంటే మరో ప్లాప్ ఆమె ఖాతాలో పడేది. జనవరి 12న విడుదలైన గుంటూరు కారం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజే ఈ చిత్ర వసూళ్లు తగ్గాయి. గుంటూరు కారంలో పూజ హెగ్డే నటించి ఉంటే ఆమెకు వరుసగా ఆరో ప్లాప్ అయ్యేది.
ప్రస్తుతం పూజ హెగ్డే హిందీలో ఒక చిత్రం చేస్తుంది. షాహిద్ కపూర్ కి జంటగా నటిస్తుంది. ఈ చిత్ర టైటిల్ దేవ. చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో పూజ హెగ్డే అధికారికంగా ఒక్క చిత్రం కూడా ప్రకటించలేదు.