ఫొటోలు: క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ..చరణ్,చిరు,బన్ని..ఇంకా
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం చెప్పుకోదగ్గ విషయం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇళ్లల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలతో ఫొటోలు దిగి.. నెట్టింట్లో షేర్ చేశారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలను నింపాలని, అంతా శుభమే జరగాలని వారు కోరుకున్నారు. చిరంజీవి, మహేశ్బాబు దంపతులు, సమంత, అనన్యపాండే, సల్మాన్ఖాన్, కరీనాకపూర్.. ఇలా సెలబ్రిటీలు షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..!
ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు అభిమనులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది.
ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ మ్యాజిక్ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ పండుగ హాలీడే సీజన్ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’. అని ట్వీట్ చేశారు.
ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. యంగ్ లుక్లో ఆయన కనపడుతున్నారు. అందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
తమ ఇంట్లో జరుపుకుంటోన్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెగా ఫ్యామిలి షేర్ చేసారు. తన పిల్లలు క్రిస్మస్ ట్రీ వద్ద దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు.
వేడుకలు జరుపుకుంటున్న అందరికీ మెస్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మీకు శాంతి, ఆనందం, ప్రేమను పరిపూర్ణంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సంతోషాన్ని, ప్రేమను ప్రతి ఒక్కరికీ పంచండి అని కోరుకున్నారు.
ప్రతి ఒక్కరికీ ఈ క్రిస్మస్ శాంతి, ఆనందం, ప్రేమ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగాయి. ప్రార్థనా మందిరాలు, ఇండ్లు, కూడళ్ల వద్ద క్రీస్తురాకకు ప్రతీకలుగా నక్షత్ర కాంతులీనుతున్నాయి.
చర్చీలు విద్యుద్దీపాల వెలుగుల్లో విరాజిల్లుతున్నాయి. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుక జరుపుకునే ప్రజలకు, అభిమానులకు టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తమ ఇంట్లో క్రిస్మస్ చెట్టును అందంగా అలరించుకుని క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న అనంతరం మెగాస్టార్ ఫ్యాన్స్కు మెర్రీ క్రిస్మస్ విషెస్ చెప్పారు.
చిరు కుటుంబసభ్యులతో కలిసి క్యూట్ స్మైల్తో ఫొటోకి ఫోజులివ్వగా..ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
క్రిస్మస్ అనేది ప్రేమ, సహనం, కరుణ, అనుబంధాలను బోధించే సంతోషకరమైన జ్ఞాపకం.
యేసుక్రీస్తు సద్గుణ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం, పునరుత్థానం ద్వారా మానవులకు మోక్షాన్ని, నిత్య జీవనాన్ని ఇచ్చారు.
చర్చిల్లో వేకువజాము నుంచే క్రిస్మస్ సంబురాలు నిర్వహించారు. ఏకుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. కేక్ కట్ చేసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఏసుక్రీస్తు పుట్టినరోజుకు గుర్తుగా జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
అనేక చోట్ల చర్చి పాస్టర్తో కలిసి క్రిస్మస్ కేక్ కట్చేసి అందరికి శుభాకాంక్షలు చెప్పుకున్నారు జనం.
ఇలా సినిమావాళ్లు క్రిస్మస్ జరుపుకోవటం ఇదేతొలి సారి కాదు. గతంలోనూ జరిగాయి.
క్రిస్మస్ కు కొద్ది రోజుల ముందు నుంచే ఇళ్లను లైట్లతో అలంకరించటం, క్రిస్మస్ ట్రీ పెట్టడం వంటివిచేసారు.
అలాగే పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తమ తోటి హీరోలకు క్రిస్మస్ గిప్ట్లులు పంపారు.
గతంలో క్రిస్మస్ ని స్టార్స్ జరుపుకున్నా ఆ ఫొటోలు బయిటకు వచ్చేవి కాదు.కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఫ్యాన్స్ కోసం ఫొటోలు వదులుతున్నారు.