నన్ను ఎందుకు అడుగుతున్నారు?, పవన్ పై రేణూ దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్ ...
పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. తన అభిమానులు అడిగే అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతారు.
తాజాగా రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ లైవ్ ఛాట్ లో పాల్గొనడం జరిగింది. అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ మూవీ టీజర్ విడుదల నేపథ్యంలో, అతనితో పిల్లలు అకీరా, ఆద్య కలిసి దిగిన ఫోటో పంచుకోవడంతో పాటు బెస్ట్ విషెష్ తెలియజేశారు.
అడివి శేష్ తో ఆద్య, అకీరాల రిలేషన్ ఏమిటని రేణూ దేశాయ్ ని ఫ్యాన్స్ అడిగారు. అడివి శేష్ వాళ్లకు బ్రదర్ అవుతాడని స్పష్టత ఇచ్చింది రేణూ దేశాయ్.
ఇక రేణూ దేశాయ్ తో ఛాట్ అంటే పవన్ ఫ్యాన్స్ దిగిపోతారు. ఈసారి కూడా కొందరు అభిమానాలు పవన్ గురించి మాట్లాడాలని, ఆయన గురించి మేము పెట్టిన మెసేజ్ లు చదవాలని కోరారు.
దీనికి రేణూ దేశాయ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రతిసారి నా లైవ్ లోకి వచ్చి పవన్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు. నా లైవ్ ఛాట్ లో ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి, అని అన్నారు.
సరే కదా అని ఏదైనా మాట్లాడితే.. మరలా మీకే కోసం వస్తుంది. మా పవన్ గురించి ఎందుకు మాట్లాడావ్ అంటూ మీరే విమరిస్తారు. అటు ఉండాలో, ఇటు ఉండాలో అర్థం కాక నా మతిపోతుంది.. అని రేణూ అన్నారు.
పవన్ తో విడాకుల తర్వాత రేణూ దేశాయ్ ఆయనపై పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్క రూపాయి కూడా అతను ఇవ్వలేదని, ఇద్దరు పిల్లల పోషణ కోసం అనేక ఇబ్బందులు పడ్డట్లు ఆమె వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ పై రేణూ ఆరోపణలు చేయడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ పై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రేణూ రెండో పెళ్లి నిర్ణయాన్ని కూడా ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒక విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఆ వివాదాల తరువాత పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ పాజిటివ్ గా మాట్లాడినా కూడా, ఫ్యాన్స్ కి నచ్చేది కాదు. బద్రి మూవీ విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా, పవన్ తో సెట్స్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ షేర్ చేశారు. ఈ విషయాన్ని కూడా ఫ్యాన్స్ తప్పుబట్టడం జరిగింది.
ఇదిలా ఉంచితే నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు రేణూ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. అలాగే సీరియల్స్ తో పాటు బుల్లితెర షోలలో ఆమె కనిపిస్తున్నారు.