సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆన్వల్ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్..2021 సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆన్వల్ కాన్ఫరెన్స్ లో సందడి చేశారు. బుధవారం జరిగిన కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ ప్రాధాన్యతని వివరించారు.
ఎన్టీఆర్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా స్వాగతం పలికారు. ఎన్టీఆర్ కారు వద్దకి వెళ్లి ఆయనకు పుష్ప గుచ్చాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తాను నిర్వహిస్తున్న యాక్టివిటీస్ గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశించి ప్రసంగించారు.
తమ కుటుంబంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు.
ఎన్టీఆర్కి గ్రాండ్గా స్వాగతం పలికారు పోలీసులు.
పోలీస్ అధికారులను పరిచయం చేస్తున్న సీపీ సజ్జనార్.
పోలీస్ అధికారులకు అభివాదం చేస్తున్న ఎన్టీఆర్.
జెండా ఊపి కాన్పరెన్స్ ని స్టార్ట్ చేస్తున్న ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన కొమురంభీమ్గా కనిపించనున్నారు.
రామ్చరణ్ మరో హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అలియా భట్, బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది.