పెళ్ళి కూతురైన మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి కళ..(ఫోటోస్ వైరల్)
మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో మ్యారేజ్ సెలబ్రేషన్ ఊపందుకుంది. పెళ్ళికి మరో మూడు రోజులే ఉండటంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ని షురూ చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్ళి సందడితోకళకళలాడుతుంది. తాజాగా నిహారికని రెడీ చేసే పనిలో ఆమె సిస్టర్స్ బిజీ అయ్యారు. నిహారక మంగళ స్నానం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నిన్న నిహారిక మూడు ఫోటోలు పంచుకుంది. అవి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఆమెను ఇద్దరు లేడీస్ రెడీ చేస్తున్నారు.
వారిద్దరూ తన కాళ్లు పట్టుకున్నట్లుగా ఈ ఫొటో ఉంది. చూసిన వారంతా అదే అనుకుంటారని భావించిన నిహారిక ఈ ఫొటో గురించి వివరణ ఇచ్చింది. ఈ ఫొటోలోని వారు నా హీల్స్ను సరిచేస్తున్నారు. వారిద్దరూ పెళ్లికూతురుని చక్కగా రెడీ చేస్తారు కాబట్టే.. నాకు తెలిశారు. లవ్ యు గర్ల్స్..` అని చెబుతూ, మరో ఫొటోలో వారిద్దరిని పరిచయం చేసింది నిహారిక.
ఇక ఇప్పుడు నిహారికని రెడీ చేస్తున్న ఆమె సిస్టర్స్ శ్రీజ, సుస్మిత. వీరిద్దరు మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు అన్న విషయం తెలిసిందే.
నిహారికతో ఉన్న ఫోటోని శ్రీజ పంచుకుని, మ్యారేజ్ షురూ అయ్యిందని, ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపింది. దీనికి నిహారిక స్పందిస్తూ, థ్యాంక్స్ చెప్పడంతోపాటు `లవ్యూ స్వీటక్కా` అని పేర్కొంది.
మరోవైపు నిహారిక పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ఆమెని పెళ్ళి కూతురుగా రెడీ చేశారు. ఈ వేడుక చాలా గ్రాండ్గా నిర్వహించారు. నిహారిక చిలకపచ్చ రంగు పట్టు చీరలో బాపు బొమ్మలా ఉంది.
శనివారం ఈ వేడుక జరిగింది. ఇందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో అలంకరించారు.
నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని హీరో, నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్ పంచుకున్నాడు.
మంగళస్నానం కార్యక్రమంలో మెగా ఆడపడుచులు సందడి చేశారు.
నిహారిక పెళ్ళి సంతోషాన్ని రెట్టింపు చేశారు.
తన కూతురు సుస్మితతో చిరంజీవి భార్య సురేఖ
ఇందులో నాగబాబు పెళ్ళి పనుల్లో బిజీగా ఉండి సేదతీరుతున్నట్టు గా ఓ ఫోటోని పంచుకున్నారు. డాగ్తో పాటు ఆయన పడుకున్నారు. నాగ్బాబు లుక్ విచిత్రంగా ఉంది.
ఈ వేడుకలో హీరో కళ్యాణ్ దేవ్, శ్రీజ జంట హైలైట్గా నిలిచింది.
ఇక నిహారికతో మెగా ఫ్యామిలీ పిల్లలు, ఇతర బంధువులు సందడి చేశారు.
నిహారిక మ్యారేజ్ గుంటూరుకి చెందిన ఐజీ జేవి ప్రభాకర్ కుమారుడు చైతన్యతో ఈ నెల 9న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల ఉదయ్ విలాస్లో చాలా గ్రాండియర్ వేలో జరుగబోతుంది. రాత్రి ఏడుగంటల 15 నిమిషాలకు ఈ మ్యారేజ్ ఈవెంట్ జరుగనుంది.
నిహారిక ప్రీ వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.