MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సరోగసి వివాదంపై త్వరలో విచారణ.. తప్పించుకునేందుకు నయనతార, విగ్నేష్ తెలివిగా ఏం చేశారంటే..

సరోగసి వివాదంపై త్వరలో విచారణ.. తప్పించుకునేందుకు నయనతార, విగ్నేష్ తెలివిగా ఏం చేశారంటే..

సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. 

2 Min read
Sreeharsha Gopagani
Published : Oct 13 2022, 11:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు.  నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు.   

26

పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అంటే వీరిద్దరూ పెళ్ళికి ముందే సరోగసి ప్లాన్ చేసుకున్నారు. ఇండియాలో సరోగసి విధానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొందరు ఇది బ్యాన్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందడం వివాదంగా మారింది. 

36

నయనతార, విగ్నేష్ శివన్ దంపతులపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా విచారణకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే దీనిపై తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రహ్మణ్యన్ స్పందించారు. సరోగసి విషయంలో వివరణ ఇవ్వాలని నయనతార దంపతులని కోరినట్లు ఆయన తెలిపారు. 

46

తాజాగా విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నియమించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి నుంచి ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది. తొలిదశ విచారణ పూర్తయిన తర్వాత అవసరం అయితే నయన్, విగ్నేష్ లని కూడా విచారణకి పిలుస్తారు. 

56

అయితే ఈ విచారణలో నయనతార, విగ్నేష్ దంపతులకు అంతగా సమస్యలు ఉండకపోవచ్చు అనే వాదన వినిపిస్తోంది. నయనతార పిల్లలకు జన్మనిచ్చిన సరోగేట్ మదర్ దుబాయ్ లో ఉంటోందట. నయన్ సోదరుడు ఆమెని ఒప్పించినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో సరోగసి కి సంబంధించిన ఎలాంటి నిబంధనలు లేవు. కాబట్టి నయన్, విగ్నేష్ లకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు. 

66

సరోగేట్ మదర్ దుబాయ్ లో ఉండొచ్చు కానీ.. పిల్లలని పొందిన నయన్, విగ్నేష్ లది ఇండియానే కాబట్టి పెద్దగా ఈ విషయంలో వారు కూడా విచారణ ఎదుర్కోవచ్చు అని మరికొందరు అంటున్నారు. మరి నయన్ సరోగసి వివాదం ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటుందో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Recommended image2
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image3
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved