- Home
- Entertainment
- పాకిస్తాన్ లో దుమ్ములేపుతున్న బాలయ్య, ఇదేం రచ్చ బాబోయ్.. టాప్ ట్రెండింగ్ కి కారణం ఆమేనా
పాకిస్తాన్ లో దుమ్ములేపుతున్న బాలయ్య, ఇదేం రచ్చ బాబోయ్.. టాప్ ట్రెండింగ్ కి కారణం ఆమేనా
నందమూరి బాలకృష్ణ నటించిన చివరి చిత్రం డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.

నందమూరి బాలకృష్ణ నటించిన చివరి చిత్రం డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల తర్వాత డాకు మహారాజ్ చిత్రం బాలయ్యకి వరుసగా నాలుగో విజయంగా నిలిచింది. ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ ఓటిటిలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు చిత్రాలకు నెమ్మదిగా అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి లాంటి చిత్రాలు అంతర్జాతీయంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. ఓటీటీ పుణ్యమా అని తెలుగు చిత్రాలు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా బాలయ్య డాకు మహారాజ్ చిత్రం కూడా ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో ట్రెండింగ్ గా నిలిచింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో డాకు మహారాజ్ దూసుకుపోతోంది.
పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, ఖతార్, యూఏఈ లాంటి దేశాల్లో డాకు మహారాజ్ చిత్రం ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి క్రేజ్ వెనుక ఒక కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ కారణం మరెవరో కాదు ఊర్వశి రౌతేలా అని అంటున్నారు. ఊర్వశి రౌతేలాకి బాలీవుడ్ చిత్రాలతో పాక్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో క్రేజ్ ఉంది.
ఇక డాకు మహారాజ్ చిత్రంలో ఊర్వశి రౌతేలా చేసిన మాస్ ఐటెం సాంగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. బాలయ్య, ఊర్వశి కలసి చేసిన బోల్డ్ మూమెంట్స్ కి మొదట విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అదే మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. బాలయ్య, ఊర్వశి రౌతేలా పెర్ఫామ్ చేసిన దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో మ్యాజిక్ జరుగుతోంది అని అంటున్నారు. మొత్తంగా డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ కి ఊర్వశి రౌతేలా కారణం అని అంటున్నారు.