చిరంజీవికి కరోనా..టెన్షన్ లో నాగార్జున, సుమ..!
మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకినట్లు ప్రకటించడంతో పరిశ్రమలో ఒక్కసారిగా కలకం రేగింది. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకినట్లు ప్రకటించడంతో పరిశ్రమలో ఒక్కసారిగా కలకం రేగింది. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.
చిరంజీవి అధికారిక ప్రకటన విడుదల చేయడంతో పాటు గత ఐదురోజులుగా తనను కలిసిన వారందరు కూడా కరోనా టెస్ట్స్ చేయించుకోవాలని, విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపై సమాచారం ఇస్తాను, ఆందోళన చెందవద్దని తెలియజేశారు.
గత రెండు రోజులలో చిరంజీవి పలువురిని కలవగా వారిలో నాగార్జున కూడా ఉన్నారు. నాగార్జున మరియు చిరంజీవి తెలంగాణా సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలిసి వరద సహాయం కోసం ప్రకటించిన చెక్స్ అందజేశారు. ఈ మీటింగ్ లో చిరంజీవి, నాగార్జున చాలా సన్నిహితంగా మెలిగారు.
దీనితో నాగార్జునకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలో మొదలైంది. కారణం బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జున ఆదివారం ఎపిసోడ్ యాంకర్ సుమ మరియు అమ్మ రాజశేఖర్ ని కలిశారు.
బిగ్ బాస్ లో సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందంటూ ఆదివారం ఎపిసోడ్ లో సుమతో పాటు నాగార్జున వేదికను పంచుకున్నారు. షోలో దాదాపు 15నిమిషాల వరకు నాగార్జున సుమతో వేదికపై ఉన్నారు.
పొరపాటున నాగార్జునకు చిరంజీవి నుండి కోవిడ్ సోకితే యాంకర్ సుమ కూడా కోవిడ్ బాధితురాలు అయ్యే అవకాశం కలదు. ఒకవేళ సుమకు కరోనా సోకిన నేపథ్యంలో ఆమె ఈ మధ్య పలు టీవీ షోల షూట్స్ లో పాల్గొన్నారు. అనేక మందిని కలిశారు.
ఇక నాగార్జునకు కోవిడ్ సోకితే అది బిగ్ బాస్ షోపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నాగార్జున ఒకటి లేదా రెండు వారాలు షో హోస్టింగ్ కి దూరం కావలసి వస్తుంది. చిరంజీవి కరోనా ప్రకటనతో అటు నాగార్జున, సుమ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక నిన్న ఎలిమినేటైన అమ్మ రాజశేఖర్ ని కూడా నాగార్జున కలిశారు. నాగార్జునకు కరోనా సోకకూడని బిగ్ బాస్ నిర్వాహకులు, షో అభిమానులు మరియు ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.