విడాకుల వార్తలు నేపథ్యంలో... వాళ్లతో సీరియస్ గా చర్చలు జరుపుతున్న నిహారిక!
మెగా డాటర్ నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. నిర్మాత ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నటుడు నాగబాబు తనయ నిహారిక చర్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల ఆమె కెరీర్ విషయంలో జోరు చూపిస్తున్నారు. నటిగా సక్సెస్ రాకపోవడంతో నిర్మాతగా ఒక స్థాయికి వెళ్లాలని ఆశపడుతున్నారు. నిహారికకు పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఉంది. ఈ నిర్మాణ సంస్థలో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మించారు.
Niharika Konidela
ఇక బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు నిహారిక సీరియస్ గా ముందుకు వెళుతున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ తో చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో నిహారిక నిర్మాతగా సంచలనాలు చేయడం ఖాయమనిపిస్తుంది.
Niharika Konidela
ఒక మనసు మూవీతో నిహారిక హీరోయిన్ అయ్యారు. తర్వాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో నటించారు. హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ రాలేదు. అలాగే మెగా హీరోలు, అభిమానుల నుండి మద్దతు లభించలేదు. నటిగా ఫెయిల్ అయిన నిహారిక నటిగా సక్సెస్ కావాలని అనుకుంటుంది.
మరోవైపు నిహారిక భర్తతో విడిపోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. గత నెలలో నిహారిక భర్త వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించారు. అలాగే ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా డిలీట్ చేశారు. ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకట చైతన్య-నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి.
Niharika Konidela
ఈ వార్తలపై నిహారికతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే అనూహ్యంగా నిహారిక కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్లోని తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. దీంతో భర్తతో విడిపోతున్నానని ఆమె పరోక్షంగా ఆమె చెప్పినట్లు అయ్యింది.
2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు. నిహారిక-వెంకట చైతన్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరు కాగా నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.