మళ్లీ అలా చేయకుండా పృథ్వీ చేతులు కట్టివేత.. పాపం ఏమైపోతాడంటూ నాగబాబు పంచ్
`రెండు చేతులు కట్టేస్తే పృథ్వీ ఎలా పట్టుకుంటాడు రా` అని అంటున్నారు నాగబాబు. `ఆ స్పెషల్స్ కి అలవాటు పడే బతుకు బస్టాండ్ అయ్యిందంటున్నారు` పృథ్వీ భార్య. మరి 30 ఇయర్స్ పృథ్వీపై వీళ్లు పంచ్లు ఎందుకేశాడు? ఎక్కడేశారు? అసలీ కథేంటి అనేది చూస్తే..
మరో మూడో రోజుల్లో తెలుగు పండుగ ఉగాది రాబోతుంది. ఈ సందర్భంగా `జీ తెలుగు`.. `ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం` పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ని ప్లాన్ చేసింది. ఇది ఈ ఆదివారం ఉదయం పది గంటలకు ప్రసారం కానుంది.
దీనికి సంబంధించి విడుదలైన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో హాట్ టాపిక్గా మారి ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం ఈ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ పాల్గొనడం.
రావడం రావడంతోనే పంచ్ డైలాగ్లతో రెచ్చిపోయాడు పృథ్వీ. ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన్ని యాంకర్ ప్రదీప్ ప్రశ్నించారు. `రాననుకున్నారా? రాలేననుకున్నారా?` అని అనగా, వీళ్లు రానివ్వరనుకున్నా అని ప్రదీప్ వేసిన పంచ్ నవ్వులు పూయించింది. మళ్లీ `మీ వాయిస్ ఎక్కడో విన్నాను సర్ అని ప్రదీప్ అంటే `అది ఇప్పుడు అవసరమా? వెంకటబత్తాయి అంటూ పృథ్వీ వేసిన పంచ్కి ప్రదీప్కి మతిపోయింది.
ఇక తనకు అపోజిట్ లీడర్ గా నామినేట్ వేసిన జానీ మాస్టర్ని పట్టుకుని ఎవరీ గడ్డం బత్తాయి అని మరో పంచ్ వేయడంతో జానీ మాస్టర్ సైతం మొఖం తేలేశారు.
అనంతరం తన టీమ్ వేణు, శ్రీనులతో కలిసి స్టేజ్పైకి వచ్చిన పృథ్వీ మన గురించి ఏమనుకుంటున్నార్రా ఊరంతా అని అడిగితే, వేణు ఉండి.. మనం గురించి ఎవరో ఏదో అనుకునే ముందు మనమే ఏదో అనుకుంటే, మనగురించి వాళ్లు అనుకోవడం మానేస్తారని భారీ డైలాగ్ కొట్టగా, ఇప్పటికే ఉన్న కన్ఫ్యూజన్స్ సరిపోవడం లేదని కొత్తగా ఇదొకటి తెచ్చావా? అని అంటాడు పృథ్వీ.
ఇంతలో ఉగాది పండుగ సందర్భంగా పృథ్వీ భార్య జీడిపప్పు ఉప్మా చేసుకొచ్చి వేడి వేడిగా ఉంది తినండి అంటుంది. ఇదేనా స్పెషల్స్ ఏం లేవా? అని ప్రశ్నిస్తాడు పృథ్వీ. దీంతో `ఇలాంటి స్పెషల్స్ కి అలవాటు పడే.. `అంటూ బుగ్గ గిల్లి వెళ్తుంది పృథ్వీ భార్య. పరోక్షంగా పృథ్వీపై కౌంటర్ వేసింది ఆమె. `ఎస్వీసీ` టీవీ ఛానెల్ విషయంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలపై వేసిన పంచ్లాగా ఉంది.
ఈ సందర్భంగా పృథ్వీ స్పందిస్తూ, ఎంతైనా ఇంటి ఫుడ్డు ఇంటి ఫుడ్డే ఎప్పుడైనా తినొచ్చు` అంటాడు. ఈ పంచ్ మాత్రం షోలో నవ్వులు పూయించింది. దీనికి నాగబాబు స్పందిస్తూ ఇంత లేట్గా అర్థమైతే ఎట్టా పృథ్వీ? అనడం మరింతగా నవ్వులు పూయించింది.
ఆ తర్వాత పృథ్వీ రెండు చేతులు వెనక్కి లాగి కట్టేస్తారు వేణు, శ్రీను. దీంతో ఆవేశంలో ఉన్న పృథ్వీ.. `తప్పు మీది కాదురా.. ఫోన్ చేయగానే క్యారెక్టర్ ఏంటి? అని అడగకుండా మేకప్ మేన్, అసిస్టెంట్ని ఏసుకుని ఓ ఊపుకుంటూ ఎగేసుకుని వచ్చాను చూడు నాదిరా తప్పు` అని అంటాడు.
దీనిపై మరోసారి నాగబాబు పంచ్ వేశాడు. శ్రీను, వేణులకు పిలిచి `మీకు కొద్దిగైనా సెన్స్ ఉందా? రెండు చేతులు లాగేస్తే.. ఏం పట్టుకుంటాడు తను` అని అనడం కడుపుబ్బ నవ్వించింది. హైలైట్గా నిలిచింది.
మొత్తంగా పృథ్వీ వేసిన ఈ స్కిట్ తనపై తాను వేసుకున్న సెటైర్లు మాదిరిగానే ఉంది.
`ఎస్వీసీ`టీవీ ఛానెల్కి పృథ్వీ గతంలో ఛైర్మెన్గా ఎన్నికయ్యారు. కొన్ని రోజుల తర్వాత మహిళని వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని దానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. దీంతో అటు పదవి లేక, ఇటు సినిమా అవకాశాలు లేక బతుకు బస్టాండే అన్నట్టుగా మారిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ టీవీ షోలో మెరిశారు పృథ్వీ. ఆయనకిది మరో కొత్త ఇన్నింగ్స్ అనే చెప్పాలి.