ఆయన మొదట నాకు ఐ లవ్ యూ చెప్పలేదు...రోజా ప్రేమ కథలో అసలు ట్విస్ట్ అదే
ఎమ్మెల్యే రోజా జబర్ధస్త్ వేదిక సాక్షిగా తన ప్రేమ కథ భయపెట్టారు. దర్శకుడు ఆర్ కె సెల్వమణి తనకు ఎలా ప్రపోజ్ చేసింది, వీరి ప్రేమ పెళ్లి ఎలా జరిగింది వంటి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. టీమ్ మెంబర్స్ నాన్ స్టాప్ పంచ్ లతో అలరించిన ప్రోమోలో రోజా తన లవ్ స్టోరీ కూడా తెలియజేశారు.
ఈ ఎపిసోడ్ సరదా సత్తిపండు, అదుర్స్ ఆనంద్ రోజా సెల్వమణి ప్రేమ కథను స్పూప్ చేశారు. రోజా భర్త సెల్వమణి కావడంతో, ఐ లవ్ యూ చెప్పడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకొనే వారు, ఆయన పడిన ఇబ్బందులను కామెడీగా చూపించారు.
ఈ స్కిట్ ప్రేక్షకులకు బాగా నవ్వులు పంచింది. ఈ స్కిట్ ద్వారా రోజా తన ప్రేమ కథను గుర్తు చేసుకోవడంతో పాటు, అప్పుడు జరిగిన విషయాన్ని తెలియజేశారు.
సెల్వమణి మొదట రోజాకి ప్రపోజ్ చేయలేదట. రోజా పేరెంట్స్ కి తన ప్రేమ కథ చెప్పి వాళ్ళు అంగీకరించాక, రోజాకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు, అని విభిన్నంగా చెప్పారట. సీతారత్నం గారి అబ్బాయి సినిమా సెట్స్ లో సెల్వమణి తన ప్రేమను రోజాకు చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.
అప్పటికే సెల్వమణిని ఇష్టపడుతున్న రోజా ఆయన ప్రేమను ఒప్పుకున్నట్లు సమాచారం. అలా వీరిద్దరి, ప్రేమ పెళ్లి కహానీ ముగిసింది.
రోజా సెల్వమణి వివాహం జరిగి దాదాపు 18ఏళ్ళు అవుతుంది. ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళు బిజీగా ఉన్న హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. ఇక 2002లో వీరిద్దరూ వివాహం చేసుకోగా...ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
1992లో వచ్చిన చెంబరుతీ సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా కాగా ఆయన దర్శకత్వంలో రోజా నటించిన మొదటి సినిమా. ఆ తరువాత సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలలో రోజా హీరోయిన్ గా నటించారు.
ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే, టీవీ హోస్ట్ గా సత్తా చాటుతున్నారు.