- Home
- Entertainment
- ఖలేజా చిత్రాన్ని సర్వనాశనం చేసింది మహేష్ బాబు అభిమానులే, తాగేసి బూతులు తిట్టారు.. నిర్మాత కామెంట్స్
ఖలేజా చిత్రాన్ని సర్వనాశనం చేసింది మహేష్ బాబు అభిమానులే, తాగేసి బూతులు తిట్టారు.. నిర్మాత కామెంట్స్
ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడానికి మహేష్ బాబు అభిమానులే కారణం అంటూ నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఖలేజా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఖలేజా రీ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 30, 2025న గ్రాండ్ రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. 2010లో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ గత పదిహేను సంవత్సరాల్లో ఈ సినిమా టీవీల్లో, యూట్యూబ్ లో ఒక కల్ట్ క్లాసిక్గా మారింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల కానుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది.
ఖలేజా ఫ్లాప్ కి అభిమానులే కారణం
ఈ చిత్ర రీ రిలీజ్ సందర్భంగా ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, "ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడానికి మహేష్ బాబు అభిమానులే కారణం. వాళ్లు ఎక్కువ అంచనాలతో థియేటర్లకు వచ్చారు, కానీ సినిమా చూశాక నిరాశపడ్డారు," అని తెలిపారు.
కామెడీ చేయడం నచ్చలేదు
ఈ క్రమంలో సి కళ్యాణ్ మహేష్ ఫ్యాన్స్ పై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. నేను ఓపెన్ గా చెబుతున్నాను. ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు అభిమానులే. వాళ్ళు ఆశించినది లేకపోవడంతో బూతులు తిట్టారు. మహేష్ బాబు కామెడీ చేయడం వాళ్ళకి నచ్చలేదు. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు మిడ్ నైట్ షో వేసే ఉద్దేశం నాకు లేదు. మిడ్ నైట్ షో ఉండదని చెప్పాను. కానీ కొంతమంది బలవంతంగా మిడ్ నైట్ షో వేయించారు.
తాగేసి తిట్టారు
ఆ షో చూసిన మహేష్ బాబు అభిమానులు తాగేసి నాకు ఫోన్ కాల్స్ చేశారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. అసలు నీకు సినిమా తీయడం తెలుసా అంటూ విరుచుకుపడ్డారు. వాళ్లే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వ్యాపించేలా చేశారు. మొత్తంగా ఖలేజా చిత్రం సర్వ నాశనం కావడానికి కారణం వాళ్లే అని సి కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
15 ఏళ్ళు పట్టింది
అయితే ఇప్పుడు అదే అభిమానులు ఈ సినిమా థియేటర్లో చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. "బహుశా ఖలేజాకు తగిన గుర్తింపు రావడానికి 15 సంవత్సరాల సమయం కావాల్సి వచ్చిందేమో," అని అన్నారు. అయితే సి కళ్యాణ్ మహేష్ ఫ్యాన్స్ పై ఇంతలా విరుచుకుపడడానికి కారణం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర రీ రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడు మహేష్ బాబు అభిమానులు ఒక లెటర్ రిలీజ్ చేశారట.
సి కళ్యాణ్ విమర్శలకు కారణం ఇదేనా ?
ఖలేజా చిత్ర రీ రిలీజ్ కి అభిమానుల మద్దతు ఉండదని తెలిపారట. నిర్మాత తమని సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ కలెక్షన్లు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తేనే మద్దతు తెలపాలనేది ఫ్యాన్స్ ఉద్దేశం. కానీ నిర్మాత కమర్షియల్ గా లాభం పొందడం కోసమే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాళ్ళకి కౌంటర్ గా సి కళ్యాణ్ మీడియా సమావేశంలో విమర్శలు చేశారు.
ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సునీల్, అర్చన, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.